Sourav Ganguly: బెంగాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సౌరవ్ గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మేదినీపూర్లోని సల్బోనిలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నాడు. 12 రోజుల స్పెయిన్, దుబాయ్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వచ్చిన ప్రతినిధి బృందంలో భాగమైన సౌరవ్ గంగూలీ, ఫ్యాక్టరీని ఐదు నుండి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, “మేము బెంగాల్లో మూడవ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. నేను కేవలం గేమ్ ఆడానని చాలా మంది నమ్ముతారు, అయితే మేము 2007లో ఒక చిన్న స్టీల్ ప్లాంట్ని ప్రారంభించాము. ఐదు నుండి ఆరు నెలల్లో మేదినీపూర్లో మా కొత్త స్టీల్ ప్లాంట్ను నిర్మించడం ప్రారంభిస్తాము”.
Read Also:Saturday : ఈ వస్తువులను దానం చేస్తే అదృష్టం పడుతుంది.. డబ్బే డబ్బు..
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
STORY | Sourav Ganguly to start steel factory in Bengal
READ: https://t.co/f5apKw18ty pic.twitter.com/2hz1P3Evf8
— Press Trust of India (@PTI_News) September 15, 2023
Read Also:Ujjwala Yojana: ఫ్రీగా గ్యాస్ కావాలంటే పీఎం ఉజ్వల యోజనలో ఇలా దరఖాస్తు చేసుకోండి
శుక్రవారం (సెప్టెంబర్ 15) మాడ్రిడ్లోని పారిశ్రామిక సదస్సు వేదికపై నుంచి గంగూలీ తన ప్రణాళికను ప్రకటించాడు. ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం మమతా బెనర్జీ ఎంతగానో సహకరించారని మాజీ క్రికెటర్ చెప్పారు. దుర్గాపూర్, పాట్నా తర్వాత మూడో ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించాలని నిర్ణయించుకున్నారో కూడా గంగూలీ వివరించారు. ఈ సమయంలో బెంగాల్ రాజకీయంగా స్థిరంగా ఉంది. ఇది మాత్రమే కాదు, బెంగాల్ పాలనా వ్యవస్థలో ప్రభుత్వం పరిశ్రమకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూ వినియోగ విధానం, భూమి మ్యాప్ను కూడా కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన గంగూలీ.. ఈ ప్రభుత్వం వాగ్దానాలు చేయడమే కాకుండా వాటిని అమలు చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు. బెంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ పెట్టుబడిదారులను కూడా ఆయన కోరారు.
తాజావార్తలు
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!