NTV Telugu Site icon

Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక

Soeme

Soeme

సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, అజయ్ మాకెన్, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇది కూడా చదవండి: NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?

మొదట ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి తీర్మానం చేశారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ICMR: సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పు ఆరోగ్యకరమైనదా?.. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయంటే?

 

ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా మెరుగైన సీట్లు సాధించింది. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని ఎంపికయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్‌ను స్పీకర్ ప్రతిపక్ష నేతగా ప్రకటించనున్నారు.