Wanaparthy: కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండి.. డీజీపీకి ఫిర్యాదు చేసిన సీఐ తల్లిదండ్రులు
- కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండి
- రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓ సీఐ తల్లిదండ్రులు
- నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా..
- ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న సీఐ
- కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ..
- డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కన్నబిడ్డలు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పిల్లలను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి, ఓ ప్రయోజనకుడిని చేస్తే తగిన పాఠాలే చెబుతున్నారు. తల్లిదండ్రులను గౌరంగా చూసుకోవాల్సిన కొడుకులు, కూతుళ్లు దారుణానికి ఒడిగడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నారు. తాజాగా.. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.
Sekhar Basha: శేఖర్ బాషాను రౌడీలతో కొట్టించిన లావణ్య?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కుతుళ్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నారు.
Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?
అయితే పెద్దకొడుకు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో ఐదేకరాల భూమి రాయించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేశాడు. అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేశాడు. దానికి ఆ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు.. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని వారు చెప్పారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!