Somireddy Chandramohan Reddy: జగన్, విపత్తులు.. కవల పిల్లలు..! ఆయన సీఎం అయ్యాక 9 విపత్తులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy: వైఎస్ జగన్, విపత్తులు.. కవల పిల్లలు..! ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక 9 విపత్తులు వచ్చాయంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉంది.. రాష్ట్రంలో 470 మండలాల్లో కరవు ఉంటే 103 మండలాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది.. 70 ఏళ్ల తర్వాత అక్టోబర్ లో లోటు వర్షపాతం నమోదైంది.. వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది.. ఇతర పంటలు వేయడం లేదు.. వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులు కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు.. కరవు ప్రాంతాలలో పర్యటిస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.. రాష్ట్రంలో కరవు లేని జిల్లా లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Minister KTR: నాంపల్లి బాధితులకు ఒక్కొక్కిరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
కడప జిల్లాలో కరవు మండలాలను ఇంకా ప్రకటించలేదు.. టీడీపీ పాలనలో కరవును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అన్నారు సోమిరెడ్డి.. రాయలసీమ బిడ్డ అని చెప్పుకొని రాయలసీమను జగన్ ముంచేస్తున్నాడు.. టీడీపీ హయంలో ఇరిగేషన్ కు రూ. 63 వేల కోట్ల నిధులను ఖర్చు చేశామని తెలిపారు.. కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ 23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ హయాంలో కరవు సమయంలో పశువులకు పశుగ్రాసంతో శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు కరవు ప్రాంతాలలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోల్ సెల్, మంత్రులు రిటైల్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వరికి 25 వేలు, వాణిజ్య పంటలకు 50 వేలు, వేరుశెనగ, జొన్న లకు 25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!