AP News: రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ ప్రారంభం!
- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం
- స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని
- ఎవరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
‘పరిపాలనా విధి విధానాలు అందరికి అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వ్యాపారస్థులు, బిల్డర్లు అందరూ స్టేక్ హోల్డర్లుగా ఉండే రెవెన్యు శాఖలో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు జరిగింది. ఇక నుంచి రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేస్కోవచ్చు. అమ్మకదారులు, కొనుగోలుదారులు, సాక్షులు.. ఇలా అందరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
’26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. 290 కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవసరం ప్రభుత్వానికి లేదు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకువస్తున్నాం. పారదర్శకంగా ఉండడం కోసమే మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నాం. భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాము. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి తగ్గేలా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా స్లాట్ విధానం అమలులోకి తేస్తున్నాము’ అని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!