Site icon NTV Telugu

Hyderabad: దుండిగల్‌లో లారీని ఢీకొట్టిన స్కోడా కారు, ముగ్గురు మృతి.

Hyd Road Accident

Hyd Road Accident

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నంది. వేగంతో వచ్చిన స్కోడా కారు.. లారీని ఢీ కొట్టింది. దీంతో.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు అక్షయ్, హరి, అస్మిత్ గా గుర్తించారు. దుండిగల్ నుంచి కుత్బుల్లాపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా.. కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version