Skin Care: కాంతివంతమైన చర్మంకోసం.. ఈ చిట్కాలు బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెరిసే అందమైన చర్మం ప్రతి అమ్మాయి కల. మన ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో షార్ట్కట్లను వెతుకుతాం. అందుకోసం ఎన్నో ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటాం. అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అని మీకు తెలుసా. అది కూడా పూర్తిగా సహజ పద్ధతుల ద్వారా…!! పసుపు, అలోవెరా చర్మ కాంతిని పెంచాలనుకునే వారికి అనువైన పదార్థాలు. ఈ నేచురల్ పదార్థాలను చర్మానికి అప్లై చేసిన వెంటనే మార్పు కనిపిస్తుంది.
పసుపు, అలోవెరా చర్మానికి చాలా మేలు చేస్తాయి. రెండింటినీ విడివిడిగా ఉపయోగించవచ్చు. కానీ, రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చర్మం మరింత మెరుస్తూ అందంగా ఉంటుంది. ఈ రెండు సహజ పదార్థాల ప్రయోజనాలు రెండు రెట్లు. కాబట్టి ఫలితం రెండు రెట్లు.
Also Read
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కలయిక చర్మానికి రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. అధిక హైడ్రేటింగ్ కలబంద, పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. ప్రకాశవంతం చేస్తుంది.
కలబంద, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం…
పసుపు, కలబంద, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి 20 నుంచి 25 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు.
అలోవెరా, పసుపు పొడి మిశ్రమాన్ని చర్మంపై కొద్దిగా గంధం కలపండి. తర్వాత అది ఆరిపోయాక నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ముడతలు పోవడానికి చాలా సహాయపడుతుంది.
కలబంద, పసుపు మిశ్రమం మొటిమల బాధితులకు చాలా సహాయపడుతుంది. కలబంద, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. కాసేపు అలాగే ఉంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య దూరమవుతుంది.
అయితే, కొన్ని విషయాలు గమనించాలి. కలబంద మరియు పసుపు మిశ్రమం చర్మానికి మేలు చేస్తుంది, అయితే ఇది కొంతమందిలో అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. పైన పేర్కొన్న పదార్ధాలలో దేనికైనా మీకు అలెర్జీ ఉంటే, దయచేసి వాటిని ఉపయోగించవద్దు.
తాజావార్తలు
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!