IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
- అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా పర్యటన
- హాట్కేకుల్లా మ్యాచ్ టికెట్లు
- ఒక్కడే 880 టిక్కెట్లు కొన్నాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్ సిరీస్కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. మ్యాచ్ టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరిగే మూడో వన్డే, అక్టోబర్ 29న కాన్బెరాలో జరిగే తొలి టీ20కి టికెట్లు మొత్తం బుక్ అయ్యాయి. రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఎనిమిది మ్యాచ్లకు సంబంధించిన 90 వేల టికెట్లను అమ్మినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. భారత సంతతి అభిమానులు ఎక్కువగా టికెట్లు కొన్నారు. అమ్ముడైన టికెట్లలో భారత అభిమాన సంఘాలే 16 శాతం కొన్నాయని సీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అభిమానుల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ల కోసం భారత్ ఆర్మీ 2400 టికెట్లను కొనుగోలు చేయగా.. మరో అభిమానుల బృందం ఫ్యాన్స్ ఇండియా 1400 టికెట్లను బుక్ చేసుకుంది. బ్రిసి బనియాస్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు అమిత్ గోయల్ గబ్బాలో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ఒక్కడే 880 టిక్కెట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఒకే మ్యాచ్కు అత్యధిక టిక్కెట్లు కొనుగోలు చేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ టిక్కెట్ల అమ్మకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చుసేందుకే ఎక్కువ మంది టికెట్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!