IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
- అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా పర్యటన
- హాట్కేకుల్లా మ్యాచ్ టికెట్లు
- ఒక్కడే 880 టిక్కెట్లు కొన్నాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్ సిరీస్కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. మ్యాచ్ టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరిగే మూడో వన్డే, అక్టోబర్ 29న కాన్బెరాలో జరిగే తొలి టీ20కి టికెట్లు మొత్తం బుక్ అయ్యాయి. రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఎనిమిది మ్యాచ్లకు సంబంధించిన 90 వేల టికెట్లను అమ్మినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. భారత సంతతి అభిమానులు ఎక్కువగా టికెట్లు కొన్నారు. అమ్ముడైన టికెట్లలో భారత అభిమాన సంఘాలే 16 శాతం కొన్నాయని సీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అభిమానుల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ల కోసం భారత్ ఆర్మీ 2400 టికెట్లను కొనుగోలు చేయగా.. మరో అభిమానుల బృందం ఫ్యాన్స్ ఇండియా 1400 టికెట్లను బుక్ చేసుకుంది. బ్రిసి బనియాస్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు అమిత్ గోయల్ గబ్బాలో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ఒక్కడే 880 టిక్కెట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఒకే మ్యాచ్కు అత్యధిక టిక్కెట్లు కొనుగోలు చేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ టిక్కెట్ల అమ్మకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చుసేందుకే ఎక్కువ మంది టికెట్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!