NTV Telugu Site icon

IPL 2024 GT: శుభ్‌మన్ గిల్‌ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..

Gt 2024

Gt 2024

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికరమైన గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు చెన్నై తీవ్రంగా పోరాడింది. చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓడింది. ఈ ఐదో విజయంతో గుజరాత్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గేమ్‌లో ఓపెనర్లు గిల్, సుదర్శన్ సెంచరీలు చేశారు.

Also Read: Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో ఆనందంలో ఉన్న శుభ్ మన్ గిల్ కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ పెద్ద షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ బౌలింగ్ కారణంగా గుజరాత్ కెప్టెన్ గిల్ కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. అదనంగా, జట్టు సభ్యులకు 25 శాతం ఫీజు లేదా రూ. 6 లక్షల జరిమానా శిక్షించబడతాయి. 2024 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ రెండోసారి స్లో ఓవర్‌రన్‌ను నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.

Also Read: Vikas Raj : ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దు

చెన్నైపై విజయంతో గిల్ సేన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు పది పాయింట్లతో పాయింట్స్ పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌లు ఆడిన గిల్ సేన ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా., ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంకా రెండు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ జట్టు రెండు గేమ్‌లు గెలిచినా ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇతర జట్ల విజయాలు, ఆ జట్టు మెరుగైన ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది.