Sanjay Raut: మహాయుతి ప్రభుత్వంపై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు.. ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలంటూ..!
- మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు
- ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని..
- తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలి- ఎంపీ సంజయ్ రౌత్
- కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై నిర్ణయం తీసుకోలేక పోయింది- సంజయ్ రౌత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు. ‘ముందుగా ముఖ్యమంత్రి ఊరేగింపును అక్కడికి తీసుకువెళతారు. సీఎం ఊరేగింపు చేపట్టే ముందు ఈవీఎంల ఊరేగింపు చేపట్టాలని, తొలి కేబినెట్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. .
Read Also: Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై నిర్ణయం తీసుకోలేక పోయిందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్రలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని సంజయ్ రౌత్ తెలిపారు. ‘‘ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఎవరికి ఏ శాఖ ఉందో తెలియడం లేదు.. మహారాష్ట్ర గ్రామాల్లో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనికి సమాధానం చెప్పలేని సీఎం.. మహారాష్ట్రలో అరాచకం సాగుతుంది. ఈ ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడింది, వారికి మెదడు లేదు, వారి మెదళ్లలో ఈవీఎంలు ఉన్నాయి” అని రౌత్ ఆరోపించారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ‘ఏక్ హైతో సేఫ్ హై’ అనే ప్రధాని మోదీ నినాదం రాష్ట్రంలో మాయాజాలంలా పని చేసిందని ఫడ్నవీస్ చెప్పారు. డిసెంబరు 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయగా.. ఉపముఖ్యమంత్రులుగా శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఈ ఫలితాలు కీలక మైలురాయిగా నిలిచాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కూడా వరుసగా 57, 41 స్థానాలతో విజయాలు సాధించాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!