Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Shiv Sena Explains These 6 Reasons Why Eknath Shinde Will Become Cm Again

Maharashtra Next CM: ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!

Published Date :November 25, 2024 , 7:28 pm
By RAMAKRISHNA KENCHE
  • మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం
  • బాంద్రాలోని ఒక హోటల్‌లో శివసేన ఎమ్మెల్యేల సమావేశం
  • ఏక్‌నాథ్ షిండేను మళ్లీ సీఎంని చేయాలని డిమాండ్
  • ఆయన మళ్లీ సీఎం కావడానికి 6 కారణాలను చెప్పిన షిండే వర్గం
Maharashtra Next CM: ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం బాంద్రాలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడ వారు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను తిరిగి ఎన్నుకున్నారు. ఉదయ్ సామంత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏక్‌నాథ్ షిండేను మళ్లీ మహారాష్ట్ర సీఎంని చేయాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శివసేన అధికార ప్రతినిధి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. “మా కూటమి పెద్ద విజయం సాధించింది. ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావాలని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.” అని తెలిపారు.

ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎంకావడానికి శివసేన తెలిపిన 6 పెద్ద కారణాలు..

1) శివసేన (యూబీటీ)ని అదుపులో ఉంచుతారు : ఏకనాథ్ ముఖ్యమంత్రి కాకపోతే.. శివసేన(యూబీటీ) మెరుగుపడుతుంది. అధికారంలోకి రావడానికి బీజేపీ శివసేన పేరును, ఎన్నికల చిహ్నాన్ని ఉపయోగించిందని, సమయం వచ్చినప్పుడు దానిని పక్కన పెట్టిందని యూబీటీ ఆరోపిస్తుంది. ఉద్ధవ్ సేన, ఎంవీఏ మిత్రపక్షాలు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర అనే విధంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి.

2) మరాఠీ గుర్తింపు బలపడుతుంది: మహాయుతి ఏకనాథ్ షిండేను సీఎంగా ఉంచడం ద్వారా మరాఠీ గుర్తింపును బలోపేతం చేయవచ్చు. ఈ నిర్ణయంతో మారాఠీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతారు. మరాఠీ గుర్తింపును గౌరవించాలనే బీజేపీ నిబద్ధతను మారాఠీలు గుర్తిస్తారు. పార్టీని గౌరవిస్తారు.

3) సుపరిపాలన కొనసాగింపు సందేశం: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల వల్లనే.. తాజా ఎన్నికల్లో మహాయుతికి భారీ సీట్లు వచ్చాయి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగడంతో సుపరిపాలనలో మహాయుతి ఇమేజ్ మరింత బలపడుతుంది. దీంతో పాటు పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

4) మహారాష్ట్రలో కుల విభజనపై నిషేధం: షిండే కాంగ్రెస్‌ను నాశనం చేసిన మరాఠా నాయకుడు. మహాయుతికి ఓటు వేయమని మరాఠాలను ఒప్పించారు. కుల విభజన, అవిశ్వాసం ఇప్పటికీ మహారాష్ట్రలో సమస్యగా మారింది. మరాఠా ముఖ్యమంత్రిని కొనసాగించడం ద్వారా అన్ని కుల విభజన శక్తులు దూరంగా ఉంటాయి. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్‌ను తారుమారు చేయకుండా సామాజిక, ఆర్థిక న్యాయం పొందేలా షిండే హామీ ఇచ్చారు.

5) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు: మహారాష్ట్ర అంతటా వచ్చే 2-3 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సీఎంని మార్చడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రజానీకం పునరాలోచనలో పడుతుంది. కొత్త సీఎం వస్తే.. ప్రస్తుత విజయంతో వచ్చిన ఊపు పోతుంది. ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా మహాయుతి ఈ జోరును కొనసాగించవచ్చు. ఇది స్థానిక ఎన్నికల్లో కూడా లాభిస్తుంది.

6) జనాదరణ పొందిన వ్యక్తి.. నాయకత్వ సామర్థ్యం: ఎన్నికలకు ముందు.. నిర్వహించిన అన్ని సర్వేల్లో మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఏక్‌నాథ్ షిండే అని తేలింది. అన్ని కులాలు/ప్రాంతాల ప్రజలు ఏకనాథ్ షిండే పట్ల గౌరవం కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలో మహాయుతి చాలా సాఫీగా కొనసాగింది. మూడు పార్టీల కూటమిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించారు. ఆయన నాయకత్వం లోక్‌సభ ఎన్నికల సమయంలో కనిపించిన బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌కు తెరపడింది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandra
  • eknath shinde
  • Maharashtra CM
  • Maharashtra Elections
  • Mahayuti Alliance

తాజావార్తలు

  • Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions