Maharashtra Next CM: ఏక్నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!
- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం
- బాంద్రాలోని ఒక హోటల్లో శివసేన ఎమ్మెల్యేల సమావేశం
- ఏక్నాథ్ షిండేను మళ్లీ సీఎంని చేయాలని డిమాండ్
- ఆయన మళ్లీ సీఎం కావడానికి 6 కారణాలను చెప్పిన షిండే వర్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం బాంద్రాలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. అక్కడ వారు శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్నాథ్ షిండేను తిరిగి ఎన్నుకున్నారు. ఉదయ్ సామంత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏక్నాథ్ షిండేను మళ్లీ మహారాష్ట్ర సీఎంని చేయాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శివసేన అధికార ప్రతినిధి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ.. “మా కూటమి పెద్ద విజయం సాధించింది. ఏక్నాథ్ షిండే మళ్లీ సీఎం కావాలని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.” అని తెలిపారు.
ఏక్నాథ్ షిండే మళ్లీ సీఎంకావడానికి శివసేన తెలిపిన 6 పెద్ద కారణాలు..
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
1) శివసేన (యూబీటీ)ని అదుపులో ఉంచుతారు : ఏకనాథ్ ముఖ్యమంత్రి కాకపోతే.. శివసేన(యూబీటీ) మెరుగుపడుతుంది. అధికారంలోకి రావడానికి బీజేపీ శివసేన పేరును, ఎన్నికల చిహ్నాన్ని ఉపయోగించిందని, సమయం వచ్చినప్పుడు దానిని పక్కన పెట్టిందని యూబీటీ ఆరోపిస్తుంది. ఉద్ధవ్ సేన, ఎంవీఏ మిత్రపక్షాలు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర అనే విధంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి.
2) మరాఠీ గుర్తింపు బలపడుతుంది: మహాయుతి ఏకనాథ్ షిండేను సీఎంగా ఉంచడం ద్వారా మరాఠీ గుర్తింపును బలోపేతం చేయవచ్చు. ఈ నిర్ణయంతో మారాఠీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతారు. మరాఠీ గుర్తింపును గౌరవించాలనే బీజేపీ నిబద్ధతను మారాఠీలు గుర్తిస్తారు. పార్టీని గౌరవిస్తారు.
3) సుపరిపాలన కొనసాగింపు సందేశం: ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల వల్లనే.. తాజా ఎన్నికల్లో మహాయుతికి భారీ సీట్లు వచ్చాయి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగడంతో సుపరిపాలనలో మహాయుతి ఇమేజ్ మరింత బలపడుతుంది. దీంతో పాటు పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
4) మహారాష్ట్రలో కుల విభజనపై నిషేధం: షిండే కాంగ్రెస్ను నాశనం చేసిన మరాఠా నాయకుడు. మహాయుతికి ఓటు వేయమని మరాఠాలను ఒప్పించారు. కుల విభజన, అవిశ్వాసం ఇప్పటికీ మహారాష్ట్రలో సమస్యగా మారింది. మరాఠా ముఖ్యమంత్రిని కొనసాగించడం ద్వారా అన్ని కుల విభజన శక్తులు దూరంగా ఉంటాయి. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్ను తారుమారు చేయకుండా సామాజిక, ఆర్థిక న్యాయం పొందేలా షిండే హామీ ఇచ్చారు.
5) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు: మహారాష్ట్ర అంతటా వచ్చే 2-3 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సీఎంని మార్చడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రజానీకం పునరాలోచనలో పడుతుంది. కొత్త సీఎం వస్తే.. ప్రస్తుత విజయంతో వచ్చిన ఊపు పోతుంది. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా మహాయుతి ఈ జోరును కొనసాగించవచ్చు. ఇది స్థానిక ఎన్నికల్లో కూడా లాభిస్తుంది.
6) జనాదరణ పొందిన వ్యక్తి.. నాయకత్వ సామర్థ్యం: ఎన్నికలకు ముందు.. నిర్వహించిన అన్ని సర్వేల్లో మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఏక్నాథ్ షిండే అని తేలింది. అన్ని కులాలు/ప్రాంతాల ప్రజలు ఏకనాథ్ షిండే పట్ల గౌరవం కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలో మహాయుతి చాలా సాఫీగా కొనసాగింది. మూడు పార్టీల కూటమిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించారు. ఆయన నాయకత్వం లోక్సభ ఎన్నికల సమయంలో కనిపించిన బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్కు తెరపడింది.
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!