Hasina Wedding Anniversary: బంగ్లా మాజీ ప్రధానికి మ్యారేజ్ డే రోజునే మరణశిక్ష!
Hasina Wedding Anniversary: బంగ్లాదేశ్ మరొసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అది ఏవిధంగా అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ICT తీర్పు వెలువరించడం ద్వారా. వాస్తవానికి షేక్ హసీనాకు నవంబర్ 17 వ తేదీతో ఎల్లప్పుడూ లోతైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ 17న ఆమె వివాహ వార్షికోత్సవం. ఈ రోజున ఆమె ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టు ఈ తేదీని ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగా ఎంచుకుందా అనే దానిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
READ ALSO: AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్జిల్లా బదిలీలపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా..
బంగ్లాదేశ్ కోర్టు తీర్పు కోసం నవంబర్ 17వ తేదీని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద వివాదం చెలరేగింది. మొదట్లో విచారణ పూర్తయిన తర్వాత, నవంబర్ 14న ICT తీర్పు ప్రకటించింది. అయితే నవంబర్ 13వ తేదీని అకస్మాత్తుగా నవంబర్ 17కి మార్చారు. ఈ మార్పు రాజకీయ కారణాల వల్ల జరిగిందా అనేది తాజా చర్చకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. బంగ్లాదేశ్ పౌరులు సోషల్ మీడియాలో రెండుగా విడిపోయి ఈ విషయంపై స్పందిస్తున్నారు. కొందరు ఇది “యాదృచ్చికం కాదు” అని, హసీనాను వ్యక్తిగతంగా అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యూహమని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీనిని “దురదృష్టకర యాదృచ్చికం” అని, “రాజకీయ ప్రతీకారం” అని కామెంట్స్ చేశారు.
హసీనా పెళ్లిరోజును ఆమెకు శిక్ష విధించేలా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ తేదీని “మోసపూరితంగా” మార్చారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. “నవంబర్ 17 హసీనా వివాహం మరణశిక్షకు దారితీసిన కథగా మారింది” అని కూడా చాలా మంది పోస్ట్లు పెడుతున్నారు. తీర్పు తర్వాత అవామీ లీగ్, షేక్ హసీనా ఈ మొత్తం ప్రక్రియను “రాజకీయ ప్రతీకారం”గా ఖండించారు. వారు ఐసీటీని అవామీ లీగ్ను రాజకీయంగా నాశనం చేయడానికి ఉద్దేశించిన “మోసపూరిత ట్రిబ్యునల్” అని అభివర్ణించారు. తనకు న్యాయమైన వాదన నిరాకరించారని, తీర్పు ముందే నిర్ణయించబడిందని హసీనా వెల్లడించారు.
షేక్ హసీనా భర్త వాజేద్ మియా..
షేక్ హసీనా భర్త ఎం.ఎ.వాజెద్ మియా కూడా పోరాటాలతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన 1963లో పాకిస్థాన్ అణుశక్తి కమిషన్లో చేరారు. కానీ ఆయన ఉద్యోగం “అన్యాయంగా” రద్దు చేశారు. తరువాత 1971లో బంగ్లా స్వాతంత్ర్యం తర్వాత, ఆయన బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్లో చేరారు. ఆయన సైన్స్, రాజకీయాలపై అనేక ముఖ్యమైన పుస్తకాలను కూడా రాశారు.
READ ALSO: KL Rahul: ఐపీఎల్ కెప్టెన్లపై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్!
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!