Hasina Wedding Anniversary: బంగ్లా మాజీ ప్రధానికి మ్యారేజ్ డే రోజునే మరణశిక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hasina Wedding Anniversary: బంగ్లాదేశ్ మరొసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అది ఏవిధంగా అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ICT తీర్పు వెలువరించడం ద్వారా. వాస్తవానికి షేక్ హసీనాకు నవంబర్ 17 వ తేదీతో ఎల్లప్పుడూ లోతైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ 17న ఆమె వివాహ వార్షికోత్సవం. ఈ రోజున ఆమె ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టు ఈ తేదీని ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగా ఎంచుకుందా అనే దానిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
READ ALSO: AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్జిల్లా బదిలీలపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు..
Also Read
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా..
బంగ్లాదేశ్ కోర్టు తీర్పు కోసం నవంబర్ 17వ తేదీని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద వివాదం చెలరేగింది. మొదట్లో విచారణ పూర్తయిన తర్వాత, నవంబర్ 14న ICT తీర్పు ప్రకటించింది. అయితే నవంబర్ 13వ తేదీని అకస్మాత్తుగా నవంబర్ 17కి మార్చారు. ఈ మార్పు రాజకీయ కారణాల వల్ల జరిగిందా అనేది తాజా చర్చకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. బంగ్లాదేశ్ పౌరులు సోషల్ మీడియాలో రెండుగా విడిపోయి ఈ విషయంపై స్పందిస్తున్నారు. కొందరు ఇది “యాదృచ్చికం కాదు” అని, హసీనాను వ్యక్తిగతంగా అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యూహమని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీనిని “దురదృష్టకర యాదృచ్చికం” అని, “రాజకీయ ప్రతీకారం” అని కామెంట్స్ చేశారు.
హసీనా పెళ్లిరోజును ఆమెకు శిక్ష విధించేలా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ తేదీని “మోసపూరితంగా” మార్చారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. “నవంబర్ 17 హసీనా వివాహం మరణశిక్షకు దారితీసిన కథగా మారింది” అని కూడా చాలా మంది పోస్ట్లు పెడుతున్నారు. తీర్పు తర్వాత అవామీ లీగ్, షేక్ హసీనా ఈ మొత్తం ప్రక్రియను “రాజకీయ ప్రతీకారం”గా ఖండించారు. వారు ఐసీటీని అవామీ లీగ్ను రాజకీయంగా నాశనం చేయడానికి ఉద్దేశించిన “మోసపూరిత ట్రిబ్యునల్” అని అభివర్ణించారు. తనకు న్యాయమైన వాదన నిరాకరించారని, తీర్పు ముందే నిర్ణయించబడిందని హసీనా వెల్లడించారు.
షేక్ హసీనా భర్త వాజేద్ మియా..
షేక్ హసీనా భర్త ఎం.ఎ.వాజెద్ మియా కూడా పోరాటాలతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన 1963లో పాకిస్థాన్ అణుశక్తి కమిషన్లో చేరారు. కానీ ఆయన ఉద్యోగం “అన్యాయంగా” రద్దు చేశారు. తరువాత 1971లో బంగ్లా స్వాతంత్ర్యం తర్వాత, ఆయన బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్లో చేరారు. ఆయన సైన్స్, రాజకీయాలపై అనేక ముఖ్యమైన పుస్తకాలను కూడా రాశారు.
READ ALSO: KL Rahul: ఐపీఎల్ కెప్టెన్లపై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్!
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!