Share Market : బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Share Market : స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద రూ.45 వేల కోట్లు పెరిగింది. గౌతమ్ అదానీ సంపద గరిష్టంగా పెరిగింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద దాదాపు 27 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఈద్ సందర్భంగా భారతీయ బిలియనీర్ల సంపదలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం..
Read Also:Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
* ముఖేష్ అంబానీ సంపద 1.12 బిలియన్ డాలర్లు అంటే రూ. 9190 కోట్లు పెరిగింది, ఆ తర్వాత అంబానీ మొత్తం సంపద 87.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* ఈ సందర్భంగా గౌతమ్ అదానీ నికర విలువ 2.17 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 18 వేల కోట్లు పెరిగింది, ఆ తర్వాత అతని మొత్తం సంపద 61.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* షాపూర్ మిస్త్రీ సంపద రూ.1780 కోట్లు పెరగగా, ఆయన సంపద 29.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరైన డిమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ తన నికర విలువను సుమారు రూ. 3500 కోట్లు పెంచుకున్నారు. మొత్తం నికర విలువ 19 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని బిలియనీర్ సైరస్ పూనావాలా సంపద రూ.492 కోట్లు పెరిగి, మొత్తం సంపద 16.9 బిలియన్ డాలర్లుగా మారింది.
* దిలీప్ సింఘ్వీ సంపద రూ. 2552 కోట్లు పెరగ్గా, ఆయన సంపద 16.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
* సావిత్రి జిందాల్ నికర విలువ రూ.1452 కోట్లు పెరిగి, నికర విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* సునీల్ మిట్టల్ నికర విలువలో 1000 కోట్ల రూపాయల పెరుగుదల కనిపించింది. అతని మొత్తం సంపద 13.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* కుమార్ బిర్లా సంపద రూ. 431 కోట్లు పెరిగింది, అతని సంపద 13.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
* DLF ప్రమోటర్ ఆస్తి రూ. 358 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 10.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* నుస్లీ వాడియా నికర విలువ రూ.493 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 9.32బిలియన్ డాలర్లకుపెరిగింది.
వీరితో పాటు అశ్వతీ డాని, బెను బంగర్, విక్రమ్ లాల్, మహేంద్ర చక్సీ, మురళీ దివి, పంకజ్ పటేల్, రాహుల్ భాటియా వంటి వారి నికర విలువ కూడా పెరిగింది.
Read Also:Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు..
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!