Share Market : బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Share Market : స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద రూ.45 వేల కోట్లు పెరిగింది. గౌతమ్ అదానీ సంపద గరిష్టంగా పెరిగింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద దాదాపు 27 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఈద్ సందర్భంగా భారతీయ బిలియనీర్ల సంపదలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం..
Read Also:Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
* ముఖేష్ అంబానీ సంపద 1.12 బిలియన్ డాలర్లు అంటే రూ. 9190 కోట్లు పెరిగింది, ఆ తర్వాత అంబానీ మొత్తం సంపద 87.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* ఈ సందర్భంగా గౌతమ్ అదానీ నికర విలువ 2.17 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 18 వేల కోట్లు పెరిగింది, ఆ తర్వాత అతని మొత్తం సంపద 61.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* షాపూర్ మిస్త్రీ సంపద రూ.1780 కోట్లు పెరగగా, ఆయన సంపద 29.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరైన డిమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ తన నికర విలువను సుమారు రూ. 3500 కోట్లు పెంచుకున్నారు. మొత్తం నికర విలువ 19 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని బిలియనీర్ సైరస్ పూనావాలా సంపద రూ.492 కోట్లు పెరిగి, మొత్తం సంపద 16.9 బిలియన్ డాలర్లుగా మారింది.
* దిలీప్ సింఘ్వీ సంపద రూ. 2552 కోట్లు పెరగ్గా, ఆయన సంపద 16.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
* సావిత్రి జిందాల్ నికర విలువ రూ.1452 కోట్లు పెరిగి, నికర విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* సునీల్ మిట్టల్ నికర విలువలో 1000 కోట్ల రూపాయల పెరుగుదల కనిపించింది. అతని మొత్తం సంపద 13.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* కుమార్ బిర్లా సంపద రూ. 431 కోట్లు పెరిగింది, అతని సంపద 13.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
* DLF ప్రమోటర్ ఆస్తి రూ. 358 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 10.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* నుస్లీ వాడియా నికర విలువ రూ.493 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 9.32బిలియన్ డాలర్లకుపెరిగింది.
వీరితో పాటు అశ్వతీ డాని, బెను బంగర్, విక్రమ్ లాల్, మహేంద్ర చక్సీ, మురళీ దివి, పంకజ్ పటేల్, రాహుల్ భాటియా వంటి వారి నికర విలువ కూడా పెరిగింది.
Read Also:Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు..
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!