Share Market : బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Share Market : స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద రూ.45 వేల కోట్లు పెరిగింది. గౌతమ్ అదానీ సంపద గరిష్టంగా పెరిగింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద దాదాపు 27 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఈద్ సందర్భంగా భారతీయ బిలియనీర్ల సంపదలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం..
Read Also:Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
Also Read
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
* ముఖేష్ అంబానీ సంపద 1.12 బిలియన్ డాలర్లు అంటే రూ. 9190 కోట్లు పెరిగింది, ఆ తర్వాత అంబానీ మొత్తం సంపద 87.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* ఈ సందర్భంగా గౌతమ్ అదానీ నికర విలువ 2.17 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 18 వేల కోట్లు పెరిగింది, ఆ తర్వాత అతని మొత్తం సంపద 61.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* షాపూర్ మిస్త్రీ సంపద రూ.1780 కోట్లు పెరగగా, ఆయన సంపద 29.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఒకరైన డిమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ తన నికర విలువను సుమారు రూ. 3500 కోట్లు పెంచుకున్నారు. మొత్తం నికర విలువ 19 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* దేశంలోని బిలియనీర్ సైరస్ పూనావాలా సంపద రూ.492 కోట్లు పెరిగి, మొత్తం సంపద 16.9 బిలియన్ డాలర్లుగా మారింది.
* దిలీప్ సింఘ్వీ సంపద రూ. 2552 కోట్లు పెరగ్గా, ఆయన సంపద 16.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
* సావిత్రి జిందాల్ నికర విలువ రూ.1452 కోట్లు పెరిగి, నికర విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* సునీల్ మిట్టల్ నికర విలువలో 1000 కోట్ల రూపాయల పెరుగుదల కనిపించింది. అతని మొత్తం సంపద 13.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* కుమార్ బిర్లా సంపద రూ. 431 కోట్లు పెరిగింది, అతని సంపద 13.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
* DLF ప్రమోటర్ ఆస్తి రూ. 358 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 10.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
* నుస్లీ వాడియా నికర విలువ రూ.493 కోట్లకు పైగా పెరిగింది, అతని మొత్తం సంపద 9.32బిలియన్ డాలర్లకుపెరిగింది.
వీరితో పాటు అశ్వతీ డాని, బెను బంగర్, విక్రమ్ లాల్, మహేంద్ర చక్సీ, మురళీ దివి, పంకజ్ పటేల్, రాహుల్ భాటియా వంటి వారి నికర విలువ కూడా పెరిగింది.
Read Also:Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!