Madhyapradesh : అచ్చం ‘త్రీ ఇడియట్స్’ లాగా, మొబైల్ ద్వారా మహిళ డెలివరీ చేయించిన డాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. డాక్టర్ వీడియో కాల్ ద్వారా ప్రసవంలో మంత్రసానికి సహాయం చేసి, మహిళను కాపాడారు. బాలీవుడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’ చూడని వారు ఉండరు. ఇందులోని ఓ సన్నివేశం చాలా పాపులర్. అది మోనా సింగ్ డెలివరీ సీన్. ల్యాప్టాప్లో ఎలా డెలివరీ చేయాలో కరీనా కపూర్ అమీర్ ఖాన్కి చూపుతుంది. అప్పుడు మోనా సింగ్ ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు.
Read Also:Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
అటువంటి పరిస్థితిలో, డాక్టర్ వీడియో కాల్ ద్వారా ప్రసవంలో మంత్రసానికి సహాయం చేసి, మహిళకు సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సమయంలో ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. సోమవారం జోరవాడి గ్రామంలో రవీనా ఉయికే అనే మహిళ ప్రసవ నొప్పితో బాధపడుతుంది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నప్పటికీ రోడ్డుపై నీరు చేరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. రవీనా ఉయికే పరిస్థితి గురించి సమాచారం అందుకున్న తరువాత, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మనీషా సిర్సామ్తో పాటు ఆరోగ్య అధికారుల బృందాన్ని గ్రామానికి పంపారు. అయితే రోడ్లన్నీ మునిగిపోయాయి. జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామానికి చేరుకోవడం అసాధ్యం అనిపించినప్పుడు, డాక్టర్ సిర్సామ్ ఉయికే భర్తకు ఫోన్ చేసి, గ్రామంలోని శిక్షణ పొందిన మంత్రసానిని తమ ఇంటికి పిలిపించమని కోరాడు.
కవలలకు జన్మ
అధిక ప్రమాదం ఉన్న మహిళ డెలివరీ అయ్యేలా ఫోన్లో ఇచ్చిన సూచనలను పాటించమని సిర్సామ్ మంత్రసాని రేష్మా వంశ్కర్ను కోరింది. మంత్రసాని సూచనలను శ్రద్ధగా పాటించి, కవలలు సురక్షితంగా పుట్టేలా చూసింది. నీటి మట్టం తగ్గుముఖం పట్టి వాహనాల రాకపోకలకు అనువుగా మారడంతో మహిళతో పాటు అప్పుడే పుట్టిన కవలలను 108 వాహనం ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి, కవలలు ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్య అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!