Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Sensational Details In Gadwal Tejeshwar Murder Case

TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

Published Date :June 26, 2025 , 9:19 pm
By Venkatesh
  • గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు
  • అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
  • తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి
TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఐశ్యర్య, తిరుమల రావు.. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును నిశితంగా పరిశీలించారు. అక్కడ భార్య.. భర్తను చంపేసి దొరికిపోయింది. కానీ అలా దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశారు. కానీ వారు రీల్స్‌లో కలలు కన్నది వేరు రియల్‌గా జరిగింది వేరు. మొత్తంగా ప్లాన్ బెడిసి కొట్టి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.

Also Read:Zohran Mamdani: “స్టాట్యూ ఆఫ్ లిబర్టీ”కి బుర్ఖా.. మమ్దానీ గెలుపు తర్వాత ఇస్లామోఫోబిక్ పోస్టులు..

Also Read

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
Add as a preferred
source on google

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

గద్వాలకు చెందిన తేజేశ్వర్ మర్డర్ కేసులో.. తవ్వినకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కట్టుకున్న భార్య ఐశ్యర్య.. అతన్ని చంపేద్దామని స్కెచ్ వేసేనాటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హానీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో అదే కేసును.. ప్రియుడు తిరుమలరావుతో కలిసి అధ్యయనం చేసింది ఐశ్వర్య. ఇద్దరూ ఈ కేసును బాగా స్టడీ చేసి.. మేఘాలయ మర్డర్ కేసులో రాజారఘువంశీని చంపిన భార్య సోనమ్‌ తరహాలో దొరికిపోవద్దని బలంగా నిర్ణయం తీసుకున్నారు. దొరకకుండా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. మర్డర్ పని పూర్తి చేసుకుని లద్దాఖ్ వెళ్లి స్థిరపడాలని కలలు కన్నారు. కానీ వారి కలలన్నీ కల్లలే అయ్యాయి.

Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?

ఐశ్వర్య, తిరుమల్‌ మధ్య 24 గంటల పాటు వీడియో కాల్‌

నిజానికి బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్న తిరుమలరావుకు అప్పటికే పెళ్లి అయింది. మంచి ఉద్యోగం… మంచి జీవితం… అయినా ఐశ్వర్య ప్రేమలో బాగా మునిగిపోయాడు. అలా అలా చాలా చాలా దూరం వెళ్లిపోయింది వారి యవ్వారం. ఐశ్వర్య, తిరుమల్‌ 24 గంటల పాటు వీడియో కాల్‌లో ఒకరినొకరు చూసుకుంటూనే ఉండేవారని తెలుస్తోంది. బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నా.. పక్కనే మొబైల్‌లో వీడియో కాల్ రన్ అవుతూనే ఉండేదని చెబుతున్నారు. ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా తిరుమల్‌తో వీడియో కాల్‌లో టచ్‌లో ఉండేదంటే వారి పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది.

Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?

కూతురుకు పెళ్లి చేయొద్దా? అనుకుంది తల్లి
ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచే.. మర్డర్ ప్లాన్ రెడీ

కొన్నాళ్లకు ఐశ్వర్య తల్లికి ఓ భయం మొదలైంది. తామిద్దరం ఇక జీవితాంతం ఇలానే మిగిలిపోవాలా? తన కూతురుకు పెళ్లి చేయొద్దా? అనుకుంది. సీన్ కట్ చేస్తే.. సర్వే వర్క్స్ చేసే తేజేశ్వర్‌తో ఐశ్వర్య పెళ్లి జరిగిపోయింది. కానీ తేజేశ్వర్ బ్యాడ్ లక్.. ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచే.. మర్డర్ ప్లాన్ రెడీ చేశారు ఐశ్వర్య అండ్ తిరుమల్. అయితే.. ఆ పెళ్లి తనకు ఇష్టమే అన్నట్టు నటించింది కిలాడీ ఐశ్వర్య. తేజేశ్వర్‌తోనూ ప్రేమగా ఉంటున్నట్టు యాక్ట్ చేసింది. కాపురం చేస్తూనే తిరుమల్‌తో కలిసి తన భర్తను లేపేయాలని స్కెచ్ వేసింది. పెళ్లి అయ్యాక కూడా అతనికి వీడియో కాల్‌లో రోజూ కాంటాక్ట్‌లో ఉండేది ఐశ్వర్య.

Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?

లఢక్ కానీ, అండమాన్ కానీ వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్

ఇక మర్డర్ స్కెచ్ వేసిన తిరుమల్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేశాడు. ఈ క్రమంలోనే అతడు మేనేజర్‌గా చేస్తున్న బ్యాంక్‌కు నగేశ్ అనే అతను లోన్ కోసం వచ్చాడు. అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిసి తేజేశ్వర్‌ను చంపాలని ప్రపోజల్ పెట్టాడు. తాను చెప్పిన అతన్ని చంపిస్తే.. ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లోన్ ఇచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అందుకు నగేశ్ ఓకే అన్నాడు. అలా ఓ సుపారీ గ్యాంగ్ కూడా రెడీ అయింది.

Also Read:Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే

ఇక తేజేశ్వర్‌ను చంపడమే మిగిలింది. చాలాసార్లు అటెంప్ట్ చేసినా అవన్నీ జస్ట్‌లో మిస్ అయ్యాయి. భర్తను చంపేసి.. తిరుమల్‌తో కలిసి లఢక్ కానీ, అండమాన్ కాని పారిపోయి కొన్నాళ్లు అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అంతలోనే మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసు వెలుగు చూసింది. ఆ కేసు చూసి భయపడాల్సింది మానేసి.. ఆ హంతకులు చేసిన తప్పులు మనం చేయొద్దంటూ మరింత పక్కాగా ప్లాన్ చేసి మరీ తేజేశ్వర్‌ను చంపేయాలని అనుకున్నారంటే వారెంత క్రిమినల్ మైండెడ్‌గా ఉన్నారో తెలుస్తోంది.

Also Read:CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?

రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు

వన్ ఫైన్ మార్నింగ్ సుపారీ టీమ్‌లోని వ్యక్తులు ముందుగా తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకున్నారు. ఫ్రెండ్ షిప్ చేశారు. అతను సర్వేయర్ కావడంతో తాము రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు. తేజేశ్వర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవడానికి అతని వాహనానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. ఓ రోజు ల్యాండ్ చూద్దామంటూ నిర్మానుష్య ప్రదేశానికి కారులో తీసుకెళ్లారు. కారులోనే వేట కొడవళ్లతో తలపై వేటు వేశారు. కడుపులో పొడిచారు. అ తర్వాత తేజేశ్వర్ డెడ్‌బాడీని కర్నూల్ ఏరియాలో నాలాలో పడేశారు. మర్డర్ చేసే టైమ్‌లో తిరుమల్‌తో హంతకులు ఫోన్ కాల్‌లో మాట్లాడుతూనే ఉన్నారు.

Also Read:Revanth Reddy: రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే..

దుస్తులకు రక్తం మరకలు అయితే కొత్త బట్టలు కొని తీసుకొచ్చాడు తిరుమల్. ఇలా ఈ కేసులో బ్యాక్ మేనేజర్ తిరుమల్‌రావు, అతని లవర్ ఐశ్వర్య కీలక సూత్రధారిగా ఉన్నారు. ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు 8మందిని అరెస్ట్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు. హత్యకు వాడిన కారు, 2 కొడవళ్ళు, కత్తి, 10 మొబైల్స్, జిపిఎస్ ట్రాకర్, లక్షా 20వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య, A8 సుజాతను చేర్చారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aishwarya
  • Bank manager crime
  • Contract Killing
  • crime news Telangana
  • Gadwal SP

తాజావార్తలు

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

  • West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions