Seetharama Project : సీత రామ మోటార్ల ట్రైల్ రన్ సక్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామల చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రైయిల్ రన్ గటగా రాత్రి సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది .సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17 వేల కోట్ల రూపాయలు అంచనా తో పది లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు కోసం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు .ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆటుపోటులను ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో ఏడు వేల కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం వ్యయం చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది .ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధం అయినప్పటికీ ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూర్ నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు.
ఈ కాలువ నిర్మాణం ఆగస్టు నెలకి పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయితే గోదావరి నుంచి సీతారామ ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా తీసుకొని వైరా వరకు సాగునీరు వస్తుంది. వైరా రిజర్వాయర్ నుంచి నాగర్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి అయిన దగ్గర నుంచి నిరంతరం సీతారామ ప్రాజెక్టు కోసం నిర్మాణం కోసం పూర్తి చేసేందుకు అధికారులు వెంట పడటం జరిగింది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించి మోటార్ల టైలరింగ్ గత రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13 వేల కోట్ల కి టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం 17 వేల కోట్లకి పెరిగింది ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు భద్రాద్రి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకి మహబూబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది
Also Read
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
- INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
తాజావార్తలు
-
Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!