Pahalgam Attack: ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు..
- పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు
- ఆదిల్ హుస్సేన్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి
- దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో కీలక పాత్ర
- మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్నాగ్ జిల్లా బిజ్బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్లో ఉన్న ఇంటిని జమ్మూకశ్మీర్ పరిపాలన బుల్డోజర్ తో కూల్చివేసింది.
READ MORE: RCB vs RR: మా ప్రణాళిక చాలా సింపుల్.. ఆర్సీబీ విజయంపై విరాట్ కోహ్లీ!
Also Read
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జమ్మూకశ్మీర్ సందర్శించడానికి వచ్చారు. ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. స్థానిక ఉగ్రవాదులిద్దరినీ బిజ్బెహారా నివాసి ఆదిల్ హుస్సేన్ థోకర్, త్రాల్ నివాసి ఆసిఫ్ షేక్గా గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి.
READ MORE: Vijayawada: బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా..
సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఆదిల్ 2018లో అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్థాన్కు వెళ్లాడు. పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందాడు. గత సంవత్సరం జమ్మూ కశ్మీర్కు తిరిగి వచ్చాడు. పహల్గామ్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరు ఉగ్రవాదులు తమలో తాము పష్టున్ భాషలో మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని వర్గాలు నొక్కిచెప్పాయి. అయితే, ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కూడా బాధ్యత వహించింది.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!