Saudi Arabia: మరణశిక్ష అమలులో నయా రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం..
Saudi Arabia: ఈ ముస్లిం దేశం శిరచ్ఛేదం(మరణశిక్ష) అమలులో నయా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. AFP లెక్కల ప్రకారం.. ఈ దేశం ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలో అత్యధికంగా విధించిన మరణశిక్ష సంఖ్య. 2024లో ఈ సంఖ్య 338 మందిగా ఉండేది. తాజా లెక్కలతో ఈ దేశం తన రికార్డును తానే అధిగమించినట్లు అయ్యింది.
READ ALSO: Shivaji: ‘దండోరా’లో నా పాత్ర మిస్టరీ.. ఇది పక్కా కమర్షియల్
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
సోమవారం మక్కాలో హత్య కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించిన తర్వాత తాజా సంఖ్య బయటికి వచ్చింది. నిజానికి సౌదీ అరేబియా తన సొంత రికార్డును బద్దలు కొట్టడం ఇది వరుసగా రెండవ సంవత్సరంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అమలు చేసిన మరణశిక్షలలో 232 మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించినవిగా సౌదీ అధికారులు తెలిపారు. మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టం ప్రకారం మరణశిక్షను ఉద్దేశపూర్వక హత్య వంటి “అత్యంత తీవ్రమైన నేరాలకు” పరిమితం చేయాలని చెబుతున్నాయి, కానీ సౌదీ అరేబియా మాత్రం ఈ నిబంధనలు నిరంతరం ఉల్లంఘిస్తోందని అన్నారు. అలాగే ఈ దేశంలో అనేక మందిని ఉగ్రవాద ఆరోపణలపై ఉరితీశారని చెప్పారు.
మైనర్లను కూడా వదిలిపెట్టలేదు..
మానవ హక్కుల సంఘాలు తెలియజేసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవలి నెలల్లో ఈ దేశంలో నేరాలు జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా మరణశిక్ష విధించారు. నిజానికి ఇది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సులో సౌదీ అరేబియా సంతకం చేసిన నిబంధనకు ప్రత్యక్ష ఉల్లంఘనగా చెబుతున్నారు. 2020లో అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత, సౌదీ ప్రభుత్వం మైనర్లకు ఉరిశిక్ష విధించబోమని పేర్కొంది. కానీ సౌదీ తన మాటమీద నిలబడకుండా అలాంటి ఉరిశిక్షలను కొనసాగిస్తూనే ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేసే దేశాలు ఇవే..
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం.. 2022, 2023, 2024 సంవత్సరాల్లో చైనా, ఇరాన్ తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన మూడవ దేశం సౌదీ అరేబియా. 2025 నాటి డేటా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
తాజావార్తలు
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?