Bhogi 2025: లక్ష 116 పిడకలను తయారు చేసిన మహిళ.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!
- పిడకలతో బోగి మంటలకు శ్రీకారం
- ఇంటి నుండి కనీసం ఒక పిడక
- లక్ష పిడకలు తయారు చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో బోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం.. ఇంటి నుండి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి. ప్రతి ఏటా బోగి సమయానికి గ్రామంలో ప్రతి ఒక్కరు 116 నుండి 1116 వరకు ప్రతి ఒక్కరు బోగి మంటల్లో పిడకలు వేయడం వారి సాంప్రదాయంగా మలుచుకున్నారు. ఇలా గ్రామంలో అలవాటుగా మారిన ఈ సాంప్రదాయం కోసం వివాహం అయినా ఆడపడుచులు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా.. సంక్రాంతి వచ్చే సమయంలో నెల ముందే ఈ గ్రామానికి కుటుంబ సమెతంగా చేరుకుంటారు.
సంక్రాంతి నేలగంట పట్టినప్పుడు నుండి వారి ఇళ్లలో ఉన్న గోవులకు పసుపు, కుంకుమతో శుద్ధి చేస్తారు. ప్రత్యేక శ్రద్ధతో ఆవు మూత్రంను, పెడను సేకరించి.. పిడకలను తయారు చేస్తారు. అప్పటి నుండి తయారు చేసిన పిడకలను ఎండబెట్టి దండలుగా తయారు చేస్తారు. అయితే గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోగి సమయంలో మంటల్లో కనీసం ఒక్క పిడక అయినా వేయడం సంప్రదాయంగా ఉన్నా.. ఈ గ్రామంలో లక్ష్మి అనే మహిళా లక్ష పిడకలతో బోగి మంటకు సిద్దమయ్యారు. గత 11 ఏళ్లుగా ఇదే పద్దతిని ఆమె పాటిస్తున్నారు. ప్రతి ఏటా నెల గంట పెట్టినప్పుడు నుండి పెడను సేకరించి నెల రోజుల వ్యవధిలో లక్ష పిడకలను తయారు చేస్తారు. సాంప్రదాయ దుస్తులతో బోగి మంటలను వేసి.. పిడకలు అందులో వేస్తున్నారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ప్రతి ఏటా వేసే లక్ష పిడకలకు బదులుగా.. ఈసారి లక్ష నూట పదహారు పిడకలను బోగి మంటకు సిద్ధం చేశానని లక్ష్మి తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమం వల్ల పాడి పంటలు, అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. లక్ష పిడకలు వేయడంతో లక్ష్మి కాంతులతో వచ్చే లక్కు కోసం ప్రతి సంక్రాంతికి ఎదురు చూస్తున్నానంటూ రామలక్ష్మి అనే మహిళ అంటున్నారు. మరో పక్క ఇతర రాష్ట్రాల నుండి ఈ గ్రామంలో బోగి రోజున వేసే పిడకల సాంప్రదాయంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాము కూడా బోగి మంటల్లో పిడకలు వేయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. లక్ష 116 పిడకలను చూసేందుకు ఇప్పటికే జనాలు క్యూ కడుతున్నారు. దాంతో రాపాక గ్రామం జన సందడిగా మారింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!