ముత్యాల ముగ్గులు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతిమణీ వైఎస్ భారతి సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత గంగిరెద్దులకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇక, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు జరిగాయి.
CM Jagan: ఘనంగా సంక్రాంతి సంబరాలు.. గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు
![Jagan](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/01/jagan-3.jpg)
Jagan