Sanju Samson: సంజూ రికార్డుల మోత.. టీ20ల్లో అత్యధిక పరుగులు..!
- దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించిన శాంసన్
- ఈ సిరీస్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన శాంసన్
- టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన శాంసన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో సంజూ శాంసన్ టీ20ల్లో అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే గాక.. ఈ సంవత్సరం టీ20ల్లో 3 సెంచరీలు చేశాడు. దీంతో.. రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మలను అధిగమించాడు .
కోహ్లీని అధిగమించాడు:
2024లో దక్షిణాఫ్రికాపై 109 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సంజూ 27 ఇన్నింగ్స్లలో 967 పరుగులు చేసి కోహ్లీని దాటేశాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్లో కోహ్లీ 25 ఇన్నింగ్స్ల్లో మొత్తం 921 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ మూడో స్థానంలో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ ఐదో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో, యశస్వి జైస్వాల్ ఏడో స్థానంలో, రితురాజ్ గైక్వాడ్ 8వ స్థానంలో ఉన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
2024లో టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్:
967 పరుగులు – సంజు శాంసన్ (27 ఇన్నింగ్స్లు)
921 పరుగులు – విరాట్ కోహ్లీ (25 ఇన్నింగ్స్లు)
874 పరుగులు – అభిషేక్ శర్మ (31 ఇన్నింగ్స్లు)
839 పరుగులు – తిలక్ వర్మ (22 ఇన్నింగ్స్లు)
795 పరుగులు – రోహిత్ శర్మ (25 ఇన్నింగ్స్లు)
774 పరుగులు – సూర్యకుమార్ యాదవ్ (28 ఇన్నింగ్స్)
728 పరుగులు – యశస్వి జైస్వాల్ (23 ఇన్నింగ్స్)
716 పరుగులు – రుతురాజ్ గైక్వాడ్ (17 ఇన్నింగ్స్)
ఏడాదిలో అత్యధిక సెంచరీలు:
సంజూ శాంసన్ 2024 సంవత్సరంలో ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 3 సెంచరీలు సాధించాడు. ఈ ఫార్మాట్లో ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన భారతదేశ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఏడాది వ్యవధిలో టీ20ల్లో 2 సెంచరీలు చేసి అద్భుతాలు చేసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను సంజూ వదిలిపెట్టాడు.
టీ20లో ఏడాదిలో అత్యధిక సెంచరీలు:
3 – సంజు శాంసన్ (2024)
2 – రోహిత్ శర్మ (2018)
2 – సూర్యకుమార్ యాదవ్ (2022)
2 – సూర్యకుమార్ యాదవ్ (2023)
2 – తిలక్ వర్మ (2024)
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!