ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్స్ ను కలిగిన మొబైల్స్ ను మార్కెట్ లోకి వదిలింది.. వాటికే ఎంతగా డిమాండ్ ఏర్పడిందో తెలిసిందే.. ఇప్పుడు మరో సూపర్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది.. శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.. ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి రానుందని శాంసంగ్ ప్రకటించింది. ఇ-కామర్స్ వెబ్సైట్ కొత్త ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ను రూపొందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్ కాస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కొత్త ఫోన్ అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్వేస్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది.. ఈ ఏడాదిలో రాబోతున్న అత్యంత సన్నని, స్టైలిష్ స్మార్ట్ మొబైల్ గా తెలుస్తుంది.. ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్తో వస్తుంది. కెమెరా రింగ్ పక్కన ఫ్లాష్లైట్తో రానుంది.. అలాగే వేగన్ లెదర్ ఎండ్తో కనీసం రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.. స్పాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీలో రన్ తో పనిచేస్తుందని తెలుస్తుంది..
ధర విషయానికొస్తే.. గెలాక్సీ F55 ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 26,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999కు పొందవచ్చు. అయితే, 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999కు కొనుగోలు చేయొచ్చు.. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర దాదాపు రూ. 23వేలు గా ఉంది.. అదే ధర ఇప్పుడు కూడా ఉంటుందని అంచనా.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..