Uttarpradesh : ‘నా భార్య రెండ్రోజులుగా అన్నం పెట్టట్లేదు’.. చేతిపై రాసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతికి భార్యే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్య వేధింపులతో ఇబ్బంది పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. యువకుడి చేతిపై తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. యువకుడి మరణంతో భార్య పరారీలో ఉంది. అయితే తరువాత పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
సంభాల్లోని ధనరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వామన్పురి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం ఉరివేసుకుని కనిపించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఉచ్చులో నుంచి మృతదేహాన్ని బయటకు తీయగా.. ‘నా చావుకు నా భార్యే కారణం. రెండు రోజులుగా భార్య భోజనం పెట్టడం లేదు’ ‘ చేతిపై రాసి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ మహిళపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Read Also:Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
రెండున్నరేళ్ల క్రితమే వివాహం
మృతి చెందిన యువకుడి పేరు హేమంత్. అతని వయస్సు 23 సంవత్సరాలు. అతనికి బదౌన్ జిల్లా థాన్పూర్ గ్రామానికి చెందిన చంద్రకాళితో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. హేమంత్ తన భార్యతో కలిసి తన కుటుంబం నుండి వేరే ఇంట్లో నివసించాడు. మంగళవారం పది గంటల సమయంలో చంద్రకాళి పొలాల దగ్గర ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. కుటుంబ సభ్యులు చంద్రకాళిని పిలిచినా ఆమె ఆగలేదు.
ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే భయంతో కుటుంబ సభ్యులు హడావుడిగా ఇంటికి వచ్చి చూడగా హేమంత్ ఇంటి మెయిన్ డోర్ ముందు నుంచి మూసి ఉంది. కుటుంబసభ్యులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి హేమంత్ గదిలో తాడుతో ఉరేసుకుని ఊగుతున్నాడు. కుటుంబ సభ్యుల అరుపులు విని చుట్టుపక్కల వారు గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం తీసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కోడలు, ఆమె తల్లి హత్య చేశారని ఆరోపిస్తూ హేమంత్ తండ్రి భూరే ఫిర్యాదు చేశారు.
లేఖలో ఏం రాశారు?
హేమంత్ చేతిపై రాసిన సూసైడ్ నోట్లో ‘నా భార్య చంద్రకాళి నాకు రెండు రోజులుగా ఆహారం ఇవ్వలేదు. నా చావుకు నా భార్యే బాధ్యత వహిస్తుంది. నా భార్య నన్ను చంపాలని అనుకుంటుంది. నా భార్య మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫోన్లో మాట్లాడుతోంది.’ అని కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిందని స్థానిక పోలీస్స్టేషన్ సీఓ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Iran Israel War : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 29 మంది ఉరి
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?