Samantha: సమంత నాటకాలాడుతోంది.. మళ్లీ ట్రోలింగ్ మొదలు..?
Samantha: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరికి ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఊరు, పేరు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు.. ఎవరిని పడితే వారిని కామెంట్స్ చేయొచ్చు అని ట్రోలర్స్ వీర్రవీగిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్సే వారి టార్గెట్. చిన్న డ్రెస్ వేసుకొంటే ట్రోల్ .. వేరొక హీరోతో కనిపిస్తే ట్రోల్స్, భర్తకు విడాకులు ఇస్తే ట్రోల్.. ఒకటని లేదు.. వారు ఏది చేసినా మంచి చేదు మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేయడమే వారికి పని. ఇక ట్రోలర్స్ వలన ఎంతో ఇబ్బంది పడినా.. పడుతున్న హీరోయిన్స్ లో మొదటి స్థానంలో ఉంది సమంత. ఆమె గురించి న్యూస్ రావడం ఆలస్యం ట్రోలర్స్ రెడీ గా ఉంటారు. సాధారణ సమయంలో ఎన్ని ట్రోల్స్ చేసినా పర్లేదు కానీ ఆమె ఆరోగ్యం బాలేనప్పుడు కూడా ఇలా ట్రోల్ చేసి నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు.
అసలు విషయం ఏంటంటే..సమంత గత కొంత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. చర్మానికి సంబంధించిన ఈ వ్యాధి చాలా అరుదైనది అని, దీనికి చికిత్స లేదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక మూడు నెలల నుంచి సామ్.. ఆ వ్యాధితో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటూ, ఇంటివద్ద రెస్ట్ తీసుకుంటూ తన స్ట్రెంత్ ను పెంచుకుంటుంది. ఇక ఆ సమయంలో కూడా ఆమె యశోద సినిమా కోసం పనిచేసింది. తనను నమ్మి సినిమా తీస్తున్న నిర్మాతలకు నష్టం కలిగించకూడదని ఆమె హాస్పిటల్ బెడ్ పైనే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమా కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాధను చెప్పుకొచ్చింది. అప్పుడు సామ్ వ్యాఖ్యలు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎదురు ఆమె ఆ వ్యాధి గురించి చెప్పుకొస్తుంటే ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆ తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన సామ్ శాకుంతలం సినిమా కోసం మళ్లీ మీడియా ముందుకు వచ్చింది. అరుదైన వ్యాధితో పోరాటం చేస్తుండడంతో ఆమె ముఖంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో కూడా సామ్ కన్నీరు పెట్టుకుంది. తనకు దైర్యం రావడానికి అభిమానుల ప్రేమే కారణమని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు సైతం తాము ఎప్పుడు సామ్ వెంట ఉంటామని దైర్యం చెప్పుకొచ్చారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా సమంత ఏడుపు పై కూడా ట్రోలర్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సమంత నాటకాలాడుతోంది అని, సినిమా హిట్ అవ్వాలని కావాలనే మీడియా ముందు ఏడ్చి సానుభూతిని క్రియేట్ చేస్తుందని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. యశోద సమయంలో ఆమె ఏడ్చిన వీడియో హిట్ అవ్వడంతో.. ఆమె మీద సానుభూతితో యశోద సినిమాకు వెళ్లి అభిమానులు హిట్ చేసారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని సామ్ మళ్లీ ప్లే చేస్తోందని, ఎందుకు అన్ని డ్రామాలు, కన్నీళ్లు, సినిమా బావుంటే వస్తారు అంటూ ట్రోలర్స్ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కు సామ్ ఏనాడు భయపడలేదు.. ఆమె బాధ నిజం, అది ఆమె కళ్లలో కనిపిస్తోంది. ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎంత ట్రోల్ చేసినా సామ్ ను వెనక్కి నెట్టేవారు లేరు.. ఆమెకు పోటీగా నిలబడేవారు లేరు అని సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!