Samantha: ఏంటి సమంత.. అలా స్టేజిపై ఏడ్చేశావ్.. అభిమానులు ఏమై పోవాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓ బేబీ, శాకుంతలం, యశోద, మజిలీ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం, నటనతో పాటు సోషల్ మాధ్యమాల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆమె దృఢంగా ముందుకెళ్తూ తెలుగు ప్రేక్షకులతో పటు దక్షిణాది సినీ అభిమానుల మనసుల్లో తన స్థానం నిలబెట్టుకుంది.
Read Also:Nara Lokesh: ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్
Also Read
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
తాజాగా అమెరికాలో ఘనంగా ముగిసిన తానా 24వ మహాసభలు మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానా వేదికపై మాట్లాడిన సమంత.. తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన జీవితంలో ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నానని చెప్పారు. ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉన్న. కానీ, ఇక్కడకు వచ్చి మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం ఈరోజే సాధ్యమైందంటూ ఆమె పేర్కొన్నారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతోనే మీరు నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించారు. అప్పటి నుంచే మీరు నాకు నిరంతరంగా ప్రేమను, మద్దతును ఇస్తున్నారు అంటూ మాట్లాడింది.
Read Also:ENG vs IND: సరేలే ఎన్నో అనుకుంటాం.. హ్యారీ బ్రూక్కు గిల్ స్ట్రాంగ్ కౌంటర్!
తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు తెలుగు ప్రజలు ఏమనుకుంటారు? అనే ఆలోచన మొదట వస్తుందని చెప్పింది. మీరు నాకు ఒక గుర్తింపునిచ్చారు. మీరు నాకు దూరంగా ఉన్నా, నా హృదయంలో ఎప్పుడూ ఉంటారు. ‘ఓ బేబీ’ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తు చేసింది. అది నిజమైందన్న నమ్మకం నాకు మొదట రాలేదని తెలిపారు. ఈ మాటలు చెబుతుంటే ఆమె కంట కన్నీళ్లు వచ్చాయి. ఈ భావోద్వేగభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు నన్ను ఎప్పుడూ నాకు కనిపించే దారి మీద నడిపించారు… మీకు కృతజ్ఞురాలిని అంటూ తానా వేదికపై ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!