Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు గెస్ట్హౌస్ అటాచ్.. సజ్జల కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన గెస్ట్ హౌస్ ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసిన విషయం విదితమే.. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు.. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.. చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలిందంటున్నారు.. అయితే, సీఐడీ అటాచ్మెంట్ పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను నిలబడి ఉన్న ఈ ప్రాంతం కూడా మాయా వేదికే.. అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు.. కానీ, ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవన్నారు సజ్జల.. లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారన్న ఆయన.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు? అని నిలదీశారు.. పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని.. కపటత్వానికి చంద్రబాబు ప్రతినిధి అని ఆరోపించారు. ఒక వైపు ప్రజల కోసం నిలబడే వైసీపీ, మరోవైపు పెత్తందారీ స్వభావం ఉన్న చంద్రబాబు, జనసేన, వారి మీడియా ఉంది.. ఈ కుట్రల పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
ఇక, రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు సజ్జల.. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి అభిమానం వ్యక్తం అవుతోందన్నారు.. ప్రతిపక్షాలకు అర్హత లేదు.. తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మాయా మారిచ శక్తుల్లా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది ఎక్కువ అవుతోందన్నారు. కోటి 60 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందాయి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలని.. అమలు చేయలేకపోతే ధైర్యంగా ఒప్పుకోగలగాలని హితవు పలికారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!