సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైనా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ లభించిన ఈ సినిమాకు టీవీలో ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చూడాలి.ప్రేక్షకుల సంక్రాంతి మూడ్ ను అర్థం చేసుకోలేక ఓ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ హీరో వెంకటేష్ సైంధవ్ మూవీతో వచ్చి బోల్తా పడ్డాడు. సైంధవ్ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈటీవీ ఈ సినిమాను మార్చి 17, సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనుంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఆ ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది.సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక భారీ నష్టాలను చవిచూసిన సినిమాగా సైంధవ్ నిలిచిపోయింది.
పాపకు అరుదైన వ్యాధి, రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఆసక్తి రేపినా మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. విపరీతమైన హింస ఎవరికీ మింగుడు పడలేదు. దీంతో సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది.ఈ సినిమాలో వెంకటేష్ తోపాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆండ్రియా జెర్మియా, ముకేశ్ రిషి మరియు బేబీ సారాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సైంధవ్ మూవీని వెంకట్ బోయనపల్లి.. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.సాదాసీదా లైఫ్ను లీడ్ చేసే హీరోకు పవర్ఫుల్ ఫ్లాష్బ్యాక్ ఉండటం అనే పాయింట్ తో ఫ్యాక్షన్, మాఫియా మరియు గ్యాంగ్స్టర్స్ ఇలా అన్ని జోనర్స్లో సినిమాలు వచ్చేసాయి. మళ్ళీ అదే పాయింట్ను తీసుకొని కొత్త క్యారెక్టరైజేషన్స్తో శైలేష్ కొలను ఈ కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్ ష్లాఫ్బ్యాక్..అతడికి సపోర్ట్గా నిలిచే పవర్ఫుల్ క్యారెక్టర్స్… ధీటైన విలన్స్ ఇలా అన్ని ఉన్నా ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేకపోయింది..