Jharkhand : బాయ్ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనే జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ నలుగురు పిల్లల తల్లిని తన బెడ్రూమ్లో మరో యువకుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో గ్రామస్థులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ బయటకు లాగారు. అనంతరం చెప్పుల దండవేసి రోడ్డుపై ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రేమ జంట వీడియో వైరల్ కావడంతో.. సాహిబ్గంజ్ జిల్లా పోలీసులు ఇప్పుడు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ విషయం మీర్జాచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా పంచాయతీ గ్రామానికి సంబంధించినది. సమాచారం మేరకు ఇక్కడ నివాసముంటున్న 40 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. మహిళకు నలుగురు పిల్లలు కాగా భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఆ మహిళ తన ప్రేమికుడిని రహస్యంగా కలుసుకునేది. అయితే ఇంతలో వీరి ఎఫైర్ గురించి జనాలకు తెలిసింది. ఒకరోజు ఆమె ప్రేమికుడు ఆమె ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరినీ గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామస్తులు వారిద్దరినీ బయటకు లాగారు. ముందుగా అతడిని కొట్టి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్
ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పులు కూడా వాయించారు. దీన్ని కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారు విచారణకు పంపించారు. ఈ ఘటనపై ఓ వాచ్మెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. పోలీసులు 15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ ఏం చెప్పారు?
సాహిబ్గంజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ – మీర్జా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని, వివాహితను అవమానించిన కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఎస్డీపీఓ సాహిబ్గంజ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులో చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!