Jharkhand : బాయ్ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనే జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ నలుగురు పిల్లల తల్లిని తన బెడ్రూమ్లో మరో యువకుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో గ్రామస్థులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ బయటకు లాగారు. అనంతరం చెప్పుల దండవేసి రోడ్డుపై ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రేమ జంట వీడియో వైరల్ కావడంతో.. సాహిబ్గంజ్ జిల్లా పోలీసులు ఇప్పుడు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ విషయం మీర్జాచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా పంచాయతీ గ్రామానికి సంబంధించినది. సమాచారం మేరకు ఇక్కడ నివాసముంటున్న 40 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. మహిళకు నలుగురు పిల్లలు కాగా భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఆ మహిళ తన ప్రేమికుడిని రహస్యంగా కలుసుకునేది. అయితే ఇంతలో వీరి ఎఫైర్ గురించి జనాలకు తెలిసింది. ఒకరోజు ఆమె ప్రేమికుడు ఆమె ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరినీ గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామస్తులు వారిద్దరినీ బయటకు లాగారు. ముందుగా అతడిని కొట్టి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.
Also Read
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్
ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పులు కూడా వాయించారు. దీన్ని కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారు విచారణకు పంపించారు. ఈ ఘటనపై ఓ వాచ్మెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. పోలీసులు 15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ ఏం చెప్పారు?
సాహిబ్గంజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ – మీర్జా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని, వివాహితను అవమానించిన కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఎస్డీపీఓ సాహిబ్గంజ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులో చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!