Jharkhand : బాయ్ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన నలుగురు పిల్లల తల్లి..చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని అంటారు. కానీ ఈ ప్రేమ అక్రమ సంబంధంగా మారితే, దాని భయంకరమైన రూపం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనే జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ నలుగురు పిల్లల తల్లిని తన బెడ్రూమ్లో మరో యువకుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో గ్రామస్థులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ బయటకు లాగారు. అనంతరం చెప్పుల దండవేసి రోడ్డుపై ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రేమ జంట వీడియో వైరల్ కావడంతో.. సాహిబ్గంజ్ జిల్లా పోలీసులు ఇప్పుడు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ విషయం మీర్జాచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా పంచాయతీ గ్రామానికి సంబంధించినది. సమాచారం మేరకు ఇక్కడ నివాసముంటున్న 40 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. మహిళకు నలుగురు పిల్లలు కాగా భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఆ మహిళ తన ప్రేమికుడిని రహస్యంగా కలుసుకునేది. అయితే ఇంతలో వీరి ఎఫైర్ గురించి జనాలకు తెలిసింది. ఒకరోజు ఆమె ప్రేమికుడు ఆమె ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరినీ గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామస్తులు వారిద్దరినీ బయటకు లాగారు. ముందుగా అతడిని కొట్టి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు.
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్
ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పులు కూడా వాయించారు. దీన్ని కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారు విచారణకు పంపించారు. ఈ ఘటనపై ఓ వాచ్మెన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. పోలీసులు 15 నుంచి 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ ఏం చెప్పారు?
సాహిబ్గంజ్ జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ – మీర్జా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని, వివాహితను అవమానించిన కేసు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఎస్డీపీఓ సాహిబ్గంజ్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులో చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..