S. Jaishankar: తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక భేటీ.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు
- ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ..
- ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయి..
- టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెబుతాం: కేంద్రమంత్రి జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S. Jaishankar: భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలపర్చుకుంటుంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Rajamouli : బాహుబలి మాయాజాలం వెనుక రాజమౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బర్త్డే వీడియో!
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఇక, ఎక్సలెన్సీ, వృద్ధి, శ్రేయస్సు పట్ల మాకు ఉమ్మడి నిబద్ధత ఉంది అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అయితే, మన రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం యొక్క ఉమ్మడి ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఉగ్రవాదాన్ని అన్ని అంతం చేయడంతో పాటు టెర్రర్ కార్యకలపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం నిరంతరం సిద్ధంగా ఉండేందుకు సమన్వయం చేసుకోవాలి అని కోరారు. భారతదేశ భద్రతా సమస్యల పట్ల మీ సున్నితత్వాన్ని, మీ సంఘీభావాన్ని మేము అభినందిస్తున్నామని కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
Read Also: AP Liquor Scam Case: సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్కు నోటీసులు
అలాగే, ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి భారతదేశం దీర్ఘకాలంగా మద్దతు ఇస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు స్వాతంత్ర్యానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం మీ జాతీయ అభివృద్ధికి, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుంది. కాబూల్లోని భారతదేశ సాంకేతిక మిషన్ను భారత రాయబార కార్యాలయ హోదాకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని జైశంకర్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!