Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్.. ఎందుకంటే!
Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాక్షలను భారతీయ ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు కదా. కానీ ఇకపై రుద్రాక్షలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కావు. స్విట్జర్లాండ్లో మన రుద్రాక్షలకు వేగంగా ప్రజాదరణ పెరుగుతోంది. అక్కడ ఉన్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మాత్రమే కాకుండా, స్థానిక స్విస్ పౌరులు కూడా యోగా, ఆరోగ్యం కోసం వీటిని స్వీకరిస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
READ ALSO: US-Venezuela War: ఆయుధాలు చేపట్టాలని పిలుపు.. అమెరికా- వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు..
Also Read
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
రుద్రాక్ష పూసలకు పెరిగిన డిమాండ్..
స్విట్జర్లాండ్లో రుద్రాక్షలు ఇకపై కేవలం మతపరమైన వినియోగానికి మాత్రమే పరిమితం కాదు. దీనిని “లౌకిక ఆధ్యాత్మికత”కు ఒక రూపంగా, ఆధునిక వెల్నెస్ ధోరణిగా అక్కడి ప్రజలు చూస్తున్నారు. అందుకే అక్కడి ఆన్లైన్ యోగా దుకాణాలు, రిటైలర్లు రుద్రాక్ష పూసలను 50 స్విస్ ఫ్రాంక్ల (సుమారు రూ.4,650) ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా వీటిని పూజా సాధనంగా మాత్రమే కాకుండా శరీరాన్ని, మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశం – యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA) రుద్రాక్ష వాణిజ్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో భారతదేశం దాదాపు రూ.0.97 కోట్ల విలువైన రుద్రాక్షలను స్విట్జర్లాండ్, ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అక్కడ 27 వేల కంటే ఎక్కువ మంది భారతీయ ప్రవాసులు, అలాగే స్విస్ ప్రజలు వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్న కారణంగా ఈ సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం..
స్విట్జర్లాండ్లో రుద్రాక్షకు ఉన్న డిమాండ్ భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. హరిద్వార్, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని సాంప్రదాయ వ్యాపారులు తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. హిమాలయ రుద్రాక్ష పరిశోధన కేంద్రం వంటి కంపెనీలు నిజమైన రుద్రాక్ష విత్తనాలను సరఫరా చేస్తూ.. వాటి నుంచి తయారైన ఆభరణాలను ఎగుమతి చేస్తున్నాయి. స్విస్ వినియోగదారులు ప్రామాణికతను విశ్వసిస్తూ, ప్రీమియం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారని ఎగుమతిదారులు చెబుతున్నారు. అందుకే ఈ మార్కెట్ భారతదేశానికి లాభదాయకంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక ఆధాయ వనరుగా మారింది.
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!