Bangladesh : బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ.. హింసాత్మక నిరసనల్లో 25 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh : బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 18 మంది మరణించారు.. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 25కి చేరింది. ఢాకాలోని రాంపుర ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ టెలివిజన్ భవనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి దాని ముందు భాగాన్ని ధ్వంసం చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అలాగే అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో జర్నలిస్టులతో పాటు పలువురు ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. 1971లో పాకిస్తాన్ నుండి దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యుద్ధ వీరుల బంధువులకు కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా ఢాకా.. ఇతర నగరాల్లోని విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలా రోజులుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇంతలో నిరసనకారులు చట్టాన్ని అమలు చేసే సంస్థలు, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల మధ్య దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 18 మంది మరణించారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్న రాజధాని ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు, పోలీసుల మధ్య పెద్ద ఘర్షణలు జరిగాయి. మరణించిన వారి గుర్తింపులను అధికారులు విడుదల చేయలేదు. అయితే మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు సూచించాయి. అంతకుముందు మంగళవారం ఆరుగురు మరణించారు. గత రాత్రి మరో మరణం నమోదైంది, వారం రోజుల క్రితం నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మరణాల సంఖ్య 25కి చేరుకుంది.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Read Also:Siddaramaiah: ప్రైవేట్ ఉద్యోగాల కోటాపై సిద్ధరామయ్య మరో ప్రకటన
పెరుగుతున్న హింస కారణంగా అధికారులు గురువారం మధ్యాహ్నం నుండి రాజధాని లోపల మెట్రో రైల్తో పాటు ఢాకాకు.. బయలుదేరే రైలు సర్వీసులను మూసివేయవలసి వచ్చింది. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్కు ఆదేశించిందని అధికారిక వార్తా సంస్థ నివేదించింది. దీనితో పాటు పారామిలిటరీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్కు చెందిన సైనికులను రాజధానితో సహా దేశవ్యాప్తంగా మోహరించారు. చాలా రోజుల నిరసనలు, హింసాత్మక ఘర్షణల తరువాత ఏడుగురు మరణించారు. గత రాత్రి నిరసనకారులు దేశంలో పూర్తి బంద్ విధించాలని నిర్ణయించుకున్నారు. పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి), అల్లర్ల నిరోధక పోలీసులు, ఎలైట్ యాంటీ క్రైమ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) ఢాకా, ఇతర ప్రధాన నగరాల వీధుల్లో మోహరించినందున ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు దేశంలో తెరిచి ఉన్నాయి. చాలా కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరాయి.
ఢాకా, దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య బస్సు సర్వీసులు కూడా మూతబడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానం వల్ల ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వ సర్వీసులకు దూరమవుతున్నారని ఆందోళనకారులు వాపోతున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ తెలిపారు. వారు అంగీకరించినప్పుడల్లా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు ప్రధానమంత్రి షేక్ హసీనా గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఖోండ్కర్ దిలిరుజ్జామన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారని న్యాయశాఖ మంత్రి తెలిపారు. తమ శాంతియుత నిరసనలపై పోలీసుల మద్దతుతో అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ దాడి చేసిందని ఆందోళనకారులు ఆరోపించారు.
Read Also:Mukesh Ambani: కుమారుడి పెళ్లిలో హిందూ వివాహ ప్రాముఖ్యతను వివరించిన ముఖేష్
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!