NTV Telugu Site icon

Mahbubabad: బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల దావత్.. చుక్కేస్తూ.. ముక్క తింటూ చిల్!(వీడియో)

Rtc

Rtc

ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే బస్సులో మందు కార్యక్రమం మొదలు పెట్టారు.. మద్యం సేవిస్తూ.. ముక్కలు తింటూ.. ఎంజాయ్ చేశారు. గమనించిన ప్రయాణికులు నిలదీయడంతో త్రాగే సిసాలు బయట పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో బస్సులో చోటుచేసుకుంది. శనివారం టీజీఎస్ ఆర్టీసీ జెఎసి ఛైర్మన్,ఈదురి వెంకన్న సారు పిలుపు మేరకు హైదారాబాద్ ఇందిర పార్క్ వద్ద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేసిన ధర్నా కోసం కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వెళ్లారు.

READ MORE: PM Modi: విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు.

ఆ ధర్నాలో తొర్రూరు డిపో నుంచి 10 మంది ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.. తిరిగి హైదారాబాద్ నుంచి తొర్రూరు వెచ్చే క్రమంలో బస్సు ఎక్కడానికి ముందే మద్యం దుకాణం వద్ద ఆపేసి.. ఆ పక్కనే మంచిగా ముక్కలు కొన్నారు. ప్రయాణికులతో నిండిపోయిన బస్సులో.. వెనక సీట్లో కూర్చుని .. మందు కార్యక్రమం మొదలెట్టారు.. మొదటి రెండు రౌండ్ సాధారణంగా జరిగిన మూడో రౌండ్ కి ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. ఎంటా నీ ప్రయాణికులు వెనక్కి చూశారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. విశేషం ఏంటంటే.. అందులో బస్సుకు చెందిన కండెక్టర్ కూడా ఉన్నాడు. గోల పెరిగిపోవడంతో ప్రయాణికులు వారిని వీడీయో తీస్తూ నిలదీశారు. ఒక్కసారిగా చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగులు మందు క్లాసులను బస్సులో నుంచి బయటపడేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.