రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. మచిలీపట్నం – విజయవాడ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ కొన్నాయి. అయితే, స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. గూడూరు దగ్గర ఇంద్ర హైటెక్ బస్సు, మార్నింగ్ స్టార్ బస్సు వెనుక నుండి ఢీకొన్న ఘటన ఇది. ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసం అయింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రెండు బస్సులు రోడ్డు పైన ఉండిపోవడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు పోలీసులు. ఎలా జరిగిందనేది తేలాల్చి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు జరుపుతున్నారు.