Rohit Sharma: టీమిండియాకు శ్రేయాస్ అయ్యర్ సైలెంట్ హీరో..
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా కైవసం
- శ్రేయాస్ అయ్యర్ సైలెంట్ హీరో- రోహిత్ శర్మ
- అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడు- రోహిత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. చివరి వరకు ఎంతో ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్.. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కీలక సమయంలో మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు.
Read Also: SK : నేచురల్ స్టార్ నాని బాటలో కోలీవుడ్ స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా..?
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “భారత్ జట్టు గురించి నాకు చాలా గర్వంగా ఉంది. పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు, కానీ మేము బాగా అలవాటు పడ్డాము. మీరు అన్ని మ్యాచ్లను పరిశీలిస్తే, మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్తో జరిగింది. అందులో కేవలం 230 పరుగులు మాత్రమే, కానీ వికెట్ కొంచెం నెమ్మదిగా ఉందని మాకు తెలుసు. మాకు భాగస్వామ్యాలు అవసరం. బ్యాట్స్మెన్లు పెద్ద పార్టనర్ షిప్లు చేశారు. టోర్నమెంట్ మొత్తం శ్రేయాస్ అయ్యర్ను మర్చిపోకూడదు. అతను అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో అతను మాకు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో అతను మంచి పార్టనర్ షిప్ అందించాడు.” అని రోహిత్ శర్మ తెలిపాడు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
టోర్నమెంట్ మొత్తం.. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అతను టీమిండియాకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ ఫైనల్లో మినహాయించి సెమీ-ఫైనల్స్, లీగ్ మ్యాచ్లలో అనేక కీలక భాగస్వామ్యాలను అందించాడు. దీంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా.. ఈ టోర్నీలో 5 మ్యాచ్లలో 241 పరుగులు చేసిన అయ్యర్.. రచిన్ రవీంద్ర తరువాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!