Rohit Sharma: టీమిండియాకు శ్రేయాస్ అయ్యర్ సైలెంట్ హీరో..
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా కైవసం
- శ్రేయాస్ అయ్యర్ సైలెంట్ హీరో- రోహిత్ శర్మ
- అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడు- రోహిత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. చివరి వరకు ఎంతో ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్.. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కీలక సమయంలో మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు.
Read Also: SK : నేచురల్ స్టార్ నాని బాటలో కోలీవుడ్ స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా..?
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “భారత్ జట్టు గురించి నాకు చాలా గర్వంగా ఉంది. పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు, కానీ మేము బాగా అలవాటు పడ్డాము. మీరు అన్ని మ్యాచ్లను పరిశీలిస్తే, మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్తో జరిగింది. అందులో కేవలం 230 పరుగులు మాత్రమే, కానీ వికెట్ కొంచెం నెమ్మదిగా ఉందని మాకు తెలుసు. మాకు భాగస్వామ్యాలు అవసరం. బ్యాట్స్మెన్లు పెద్ద పార్టనర్ షిప్లు చేశారు. టోర్నమెంట్ మొత్తం శ్రేయాస్ అయ్యర్ను మర్చిపోకూడదు. అతను అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో అతను మాకు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో అతను మంచి పార్టనర్ షిప్ అందించాడు.” అని రోహిత్ శర్మ తెలిపాడు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
టోర్నమెంట్ మొత్తం.. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అతను టీమిండియాకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ ఫైనల్లో మినహాయించి సెమీ-ఫైనల్స్, లీగ్ మ్యాచ్లలో అనేక కీలక భాగస్వామ్యాలను అందించాడు. దీంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా.. ఈ టోర్నీలో 5 మ్యాచ్లలో 241 పరుగులు చేసిన అయ్యర్.. రచిన్ రవీంద్ర తరువాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!