NTV Telugu Site icon

Road Accident: హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి

Accident

Accident

Road Accident: హైదరాబాద్‌- బెంగుళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తూరు వై జంక్షన్ వద్ద మూడు లారీలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ బోల్తా పడింది. ఆ లారీ పక్కనే వెళ్తున్న బైక్‌పై పడడంతో.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన అంజయ్యగా గుర్తించారు. మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: Drugs Case: హైదరాబాద్‌లో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష

లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 గంటలుగా వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.