Rhea Chakraborty: డ్రగ్స్ కేసులో హీరోయిన్కు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
NCB రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలులో డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలపై ఆమె అక్రమ రవాణాకు ఆర్థిక సహాయం చేసిందని అర్థం కాదు అని పిటిఐ హైకోర్టును ఉటంకిస్తూ పేర్కొంది. చట్టం కింద వివరించిన విధంగా నేరస్థుడికి ఆశ్రయం కల్పించడం అంటే ఆ వ్యక్తికి మాదకద్రవ్యాల వినియోగం కోసం డబ్బును అందించడంతోపాటు అతనికి ఆశ్రయం, ఆహారం కూడా అందించడం అని కూడా పేర్కొంది..1 లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ, చక్రవర్తికి నేర చరిత్రలు లేవని, ఆమె బెయిల్పై బయట ఉన్నప్పుడు సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం లేదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో గమనించింది. అయితే, చక్రవర్తి కేసులో, ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం (డ్రగ్స్ లేదా దాని వినియోగదారులకు) లేనందున, సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.. సుశాంత్ సింగ్ రాజ్పుత్, 34, జూన్ 14, 2020న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించాడు. చక్రవర్తిపై రాజ్పుత్ తల్లిదండ్రులు ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించిన కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె నెల రోజులు రిమాండ్ లో ఉండి విడుదలైంది..
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!