CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై చర్చిస్తామని ముందే చెప్పామని, సభలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ సభ్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. బీజేపీ తన “చీకటి మిత్రుడిని” కాపాడేందుకు ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో విచారణకు ఆదేశించామని తెలిపారు. భూముల వ్యవహారాలు, విద్యుత్ కొనుగోళ్లపై కూడా సభలో చర్చ జరిగిన తర్వాతే విచారణకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
“చర్చ లేకుండా ఉరి శిక్ష వేయాలని అనడం సరికాదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ సభ్యులు చెప్పాలనుకున్న అంశాలపై చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయాలను బీఏసీలో ప్రస్తావించాలని సూచించారు. సభలో షార్ట్ డిస్కషన్కు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు.
Also Read
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
సభలో సభ్యులకు ఏదైనా జరిగినప్పుడు వారిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందని సీఎం అన్నారు. అలాంటి స్పీకర్ స్థానానికే అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం ఒక్క వ్యక్తికి జరిగినది కాదని, సభలోని సభ్యులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. స్పీకర్ స్థానానికి ఎంతో గౌరవం ఉందని, సభలో సభ్యుల గౌరవంతో పాటు ప్రజల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
“సభాపతిపై సభ్య సమాజం సహించలేని మాటలు మాట్లాడతారా?” అని ప్రశ్నించారు. సమాజం తలవంచుకునేలా మాట్లాడితే అది మొత్తం శాసనసభకే అవమానమని వ్యాఖ్యానించారు. సభా నాయకుడిగా తాను హామీ ఇస్తున్నానని, బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని సీఎం కోరారు. వారు చెప్పాలనుకున్న అంశాలను సభలో చర్చకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. నిన్న ఫామ్హౌస్కు పిలిచి బీజేపీ సభ్యులను రెచ్చగొట్టి పంపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు సభ్య సమాజం క్షమించరాని నేరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!