Murder Case: హైదరాబాద్ లోని రిటైర్డ్ ఐపిఎస్ వినయ్ రంజనే భార్య తనూజ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ దోపిడిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచే స్కెచ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ముంబై నేపాల్ పాట్న నుంచి వేరు వేరు వ్యక్తులను కల్పన అటాచ్ చేసి దోపిడి చేసినట్లు నిర్ధారించారు. దోపిడి చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనూజను హత్య చేసి దోపిడి చేసింది కల్పన అండ్ గ్యాంగ్ హత్య తర్వాత కల్పనతో పాటు మరో ఇద్దరు దొంగలు రైలులో పారిపోయారు. పూణేలోని తల్లిదండ్రుల దగ్గరకు కల్పన రావడంతో అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మిగితా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
