PM Modi : ప్రధాని మోడీ ఊరిలో లభించిన 2800 ఏళ్ల నాటి నివాస అవశేషాలు

New Project (37)

New Project (37)

PM Modi : గుజరాత్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ గ్రామంలో 2800ఏళ్ల క్రితం అంటే దాదాపు 800 ఏడీ నాటి నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖరగ్‌పూర్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), డెక్కన్ కాలేజీ పరిశోధకులు 800 BC నాటి (క్రిస్టియన్లకు పూర్వం) పురాతన ప్రదేశాలను కనుగొన్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి. గుజరాత్‌లోని వాద్‌నగర్‌ ప్రధాని నరేంద్ర మోడీ పూర్వీకుల గ్రామం.

Read Also:Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?

ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ అనింద్యా సర్కార్ మాట్లాడుతూ 2016 నుంచి తవ్వకం పనులు కొనసాగుతున్నాయని, బృందం 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపిందని చెప్పారు. మానవ నివాసం 800 BC నాటిదని అధికారులు తెలిపారు. ఏడు సాంస్కృతిక కాలాల ఉనికిని ఇందులో ఆవిష్కరించారు. లోతైన త్రవ్వకాల్లో మౌయ, ఇండో-గ్రీక్, షక-క్షత్రప, హిందూ-సోలంకి, సుల్తానేట్-మొఘల్ (ఇస్లామిక్) నుండి గైక్వాడ్-బ్రిటీష్ వలస పాలన వరకు ఏడు సాంస్కృతిక కాలాలు ఉన్నట్లు వెల్లడైంది,” అని ASI పురావస్తు శాస్త్రవేత్త అభిజీత్ అంబేకర్ తెలిపారు. మా త్రవ్వకాల్లో పురాతన బౌద్ధ విహారం కూడా కనుగొనబడింది. మేము ప్రత్యేకమైన పురావస్తు కళాఖండాలు, కుండలు, రాగి, బంగారం, వెండి, ఇనుప వస్తువులు, గాజులను కనుగొన్నాము. వాడ్‌నగర్‌లో ఇండో-గ్రీక్ పాలనలో గ్రీకు రాజు అపోలోడాటస్ నాణేల అచ్చులను కూడా మేము కనుగొన్నాము.” అని అంబేకర్ అన్నారు.

Read Also:Aurangabad: పార్కింగ్ విషయంలో గొడవ.. నలుగురి హత్య.. ఆరుగురు అరెస్ట్

ఈ 3,000 సంవత్సరాలలో వివిధ సామ్రాజ్యాల ఆవిర్భావం, పతనం, మధ్య ఆసియా యోధులు భారతదేశంపై పదేపదే దాడులు చేయడం వర్షం లేదా అనావృష్టి వంటి మార్పుల వల్లే సంభవించినట్లు వాద్‌నగర్‌లోని తీవ్రమైన పురావస్తు త్రవ్వకాల అధ్యయనం కూడా వెల్లడిస్తోందని IIT ఖరగ్‌పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అధ్యయనం ఎల్సెవియర్ జర్నల్ ‘క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్’లో ‘క్లైమేట్, హ్యూమన్ సెటిల్‌మెంట్ అండ్ మైగ్రేషన్ ప్రారంభ చారిత్రక నుండి మధ్యయుగ కాలం వరకు: పశ్చిమ భారతదేశంలోని వాద్‌నగర్‌లో కొత్త పురావస్తు త్రవ్వకాల నుండి ఆధారాలు’ అనే అంశంతో ప్రచురించబడింది. గుజరాత్ ప్రభుత్వ ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టరేట్ నిధులు సమకూరుస్తుండగా, తవ్వకానికి ASI నాయకత్వం వహిస్తోంది. వాద్‌నగర్ బహుళ-సాంస్కృతిక, బహుళ-మతాల (బౌద్ధ, హిందూ, జైన మరియు ఇస్లామిక్) స్థావరం.