Budget 2024: పేద ఖైదీలకు ఊరట..పెనాల్టీ, బెయిల్ కోసం ఆర్థిక సాయం..

  • పేద ఖైదీల కోసం ప్రత్యేక కేటాయింపులు
  • బడ్జెట్‌లో సుమారు రూ.20 కోట్లు
  • పెనాల్టీ..బెయిల్ కోసం నగదు చెల్లించలేని ఖైదీలకు ఆర్థిక సాయం
  • జైళ్ల ఆధునీకీకరణకు రూ.300 కోట్లు
Budget 2024

Budget 2024

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024-25లో సమాజంలోని అన్ని వర్గాల పట్ల శ్రద్ధ చూపగా.. జైలు ఖైదీల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఖైదీలకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో సుమారు రూ.20 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో పేద ఖైదీల కోసం కేటాయించిన ఈ మొత్తం పెనాల్టీ, బెయిల్ కోసం నగదు చెల్లించలేని ఖైదీలకు ఆర్థిక సహాయంగా అందించబడుతుంది. ఇది కాకుండా కేంద్ర బడ్జెట్ 2024లో జైళ్ల ఆధునీకీకరణకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని జైలు నిర్వహణకు కూడా వినియోగించనున్నారు.

READ MORE: TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..

×
×
Ad

పోలీసు శాఖకు రూ. 520 కోట్లు..
కేంద్ర ఆర్థిక మంత్రి 2024-25 బడ్జెట్‌లో పోలీసు శాఖకు రూ.520 కోట్లు కేటాయించారు. కేటాయించిన మొత్తాన్ని రాష్ట్ర పోలీసు బలగాల ఆధునికీకరణ, పోలీసు మౌలిక సదుపాయాల పెంపు, ప్రత్యేక ప్రాజెక్టులు, నేరాలు మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ వ్యవస్థ కోసం వినియోగిస్తారు. గత బడ్జెట్‌లో దీని కింద దాదాపు రూ.221 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి.