Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..

Red Mi

Red Mi

శామ్‌సంగ్, వివో, రియల్‌మీ ప్రాడక్ట్స్‌తో పోలిస్తే, షియోమీ తన సబ్-బ్రాండ్ రెడ్‌మీ నుంచి కొత్త ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో’ సిరీస్‌ను భారత్‌లో సెప్టెంబర్ 15, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో’ , ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్’ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఫోన్‌లలో ప్రధాన ఆకర్షణగా 10,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. కంపెనీ ఈ సదుపాయాన్ని “mAhster of strength” పేరిట ప్రచారం చేస్తోంది. తక్కువ వాడకంలో ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే విడుదలైన ప్రో మ్యాక్స్ మోడల్‌లో 10,000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ప్రదర్శన విభాగంలో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రొసెసర్‌తో పాటు 16GB వరకు ఎక్స్‌పాండెడ్ ర్యామ్ సపోర్ట్, రోజువారీ పనులు మరియు గేమింగ్‌కు అనుకూలంగా ఉంది.

కెమెరా విభాగంలో వెనుకవైపు OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP ఆల్ట్రా-వైడ్ కెమెరా మరియు ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనికి IP66, IP68 రేటింగ్‌లతో నీరు మరియు ధూళి నుండి భద్రత లభిస్తుంది. భారత మార్కెట్‌లో అధికారిక ధరలు వెల్లడి కానప్పటికీ, మునుపటి మోడళ్ల కంటే రూ. 5,000 నుండి రూ. 8,000 వరకు అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌లు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.