Pahalgam Terror Attack: పాకిస్తాన్పై ప్రతీకారానికి సిద్ధం.. ఇండియా ముందు ఉన్న దారులు ఇవే..
- పాకిస్తాన్పై ప్రతీకారానికి సిద్ధమవుతున్న భారత్..
- సైనికంగా, దౌత్యపరంగా దాడులు..
- సింధు నదీ ఒప్పందం రద్దు చేసే యోచన..
- పాక్తో దౌత్య సంబంధాల ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం కాశ్మీర్ అందాలను చూసేందుకు పహల్గామ్ బైసరీన్ గడ్డి మైదానాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
ఈ దాడిపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యు్న్నత సమావేశం జరుగుతోంది. మరోవైపు అమిత్ షా కాశ్మీర్లో భద్రతా బలగాలతో సమీక్షిస్తున్నారు. ఇంకోవైపు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్( త్రివిధ దళాల అధిపతి), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా ప్రజలు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు.
Also Read
- India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
Read Also: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. రూ.10లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై భారీ ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ని సైనికంగా, దౌత్యపరంగా దెబ్బ కొట్టేందుకు భారత్ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మనదేశం నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని భారత్ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. పాకిస్తాన్లోని భారత్ హైకమిషన్ని పూర్తిగా షట్ డౌన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారత్, పాక్ మధ్య పూర్తి స్థాయిలో దౌత్య కార్యకలాపాలు నిలిచిపోతాయి.
పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల హ్యాండర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ కేంద్రంగా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పీఓకే వెంబడి ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లోనే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్లోని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై భారత్ దాడి చేసే అవకాశం ఉంది. దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని ఆధారాలతో చూపించి, ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాల ముందు పాక్ని దోషిగా నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
-
Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!