Check Clearing: ఇకపై డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్.. RBI కొత్త రూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Check Clearing: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నూతన సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అక్టోబర్ 4 నుండి ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి ఒకే రోజు చెక్ క్లియరెన్స్ను ప్రారంభించనున్నాయి. ఈ నూతన వ్యవస్థ వల్ల అక్టోబర్ 4వ తేదీ నుండి డిపాజిట్ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే, అంటే అదే రోజున క్లియర్ అవుతాయి. దీనితో బ్యాంకులు తమ కస్టమర్లకు చెక్ బౌన్స్ కాకుండా నిరోధించడానికి ఖాతాలలో తగినంత నిల్వలు ఉంచుకోవాలని, అలాగే ఆలస్యం లేదా తిరస్కరణ జరగకుండా చెక్కు వివరాలన్నీ సరిగ్గా నింపాలని సూచించాయి. భద్రతను పెంచడానికి, ప్రీ-ఎంట్రీ పాజిటివ్ పే సిస్టమ్ను (Positive Pay System) ఉపయోగించాలని కూడా బ్యాంకులు కస్టమర్లను కోరాయి.
Pedda Reddy: మరోసారి ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు ఖాతాదారులు ఖాతా సంఖ్య, చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుని పేరు వంటి ముఖ్య వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. చెక్కును సమర్పించినప్పుడు బ్యాంకులు ఈ వివరాలను ధృవీకరిస్తాయి. వివరాలు సరిపోలితేనే చెక్ క్లియర్ అవుతుంది. లేకపోతే, రిక్వెస్ట్ తిరస్కరించబడుతుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను నిర్దిష్ట ప్రాంతీయ ఈమెయిల్ అడ్రస్లకు పంపాలి. ప్రాసెసింగ్ ప్రారంభించే ముందు, బ్యాంకులు రసీదు సందేశాన్ని పంపుతాయి.
ప్రస్తుతం బ్యాంకులు, చెక్కు ఎలక్ట్రానిక్ చిత్రాన్ని, వివరాలను డ్రాయీ బ్యాంకుకు పంపే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను (CTS) ఉపయోగిస్తున్నాయి. ఇది భౌతికంగా చెక్కును బదిలీ చేయాల్సిన అవసరాన్ని తొలగించినప్పటికీ, డ్రాప్ బాక్స్లు లేదా ఏటీఎంలలో డిపాజిట్ చేసినప్పుడు సెటిల్మెంట్ కావడానికి సాధారణంగా రెండు పని దినాలు పడుతోంది. ఇకపై రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు పాజిటివ్ పే తప్పనిసరి అని, రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన వాటికి ఇది సిఫార్సు చేయబడుతుందని RBI తెలియజేసింది.
Falaknuma Road Over Bridge: ఫలక్నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
ఇక పాజిటివ్ పే కింద ధృవీకరించబడిన చెక్కులకు RBI వివాద పరిష్కార వ్యవస్థలో రక్షణ లభిస్తుంది. నిరంతర క్లియరింగ్, సెటిల్మెంట్లో మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుండి, అలాగే రెండవ దశ జనవరి 3, 2026 నుండి ప్రారంభమవుతుందని RBI ప్రకటించింది. తిరస్కరణను నివారించడానికి, కస్టమర్లు అంకెల్లో, అక్షరాలలో రాసిన మొత్తం సరిపోలాలని, చెక్ తేదీ చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, చెల్లింపుదారుని పేరు లేదా మొత్తంలో ఓవర్రైటింగ్ ఉండకూడదని, అలాగే సంతకం బ్యాంకు రికార్డులతో సరిపోలాలని నిర్ధారించుకోవాలి.
- Tags
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!