Check Clearing: ఇకపై డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్.. RBI కొత్త రూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Check Clearing: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నూతన సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అక్టోబర్ 4 నుండి ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి ఒకే రోజు చెక్ క్లియరెన్స్ను ప్రారంభించనున్నాయి. ఈ నూతన వ్యవస్థ వల్ల అక్టోబర్ 4వ తేదీ నుండి డిపాజిట్ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే, అంటే అదే రోజున క్లియర్ అవుతాయి. దీనితో బ్యాంకులు తమ కస్టమర్లకు చెక్ బౌన్స్ కాకుండా నిరోధించడానికి ఖాతాలలో తగినంత నిల్వలు ఉంచుకోవాలని, అలాగే ఆలస్యం లేదా తిరస్కరణ జరగకుండా చెక్కు వివరాలన్నీ సరిగ్గా నింపాలని సూచించాయి. భద్రతను పెంచడానికి, ప్రీ-ఎంట్రీ పాజిటివ్ పే సిస్టమ్ను (Positive Pay System) ఉపయోగించాలని కూడా బ్యాంకులు కస్టమర్లను కోరాయి.
Pedda Reddy: మరోసారి ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు ఖాతాదారులు ఖాతా సంఖ్య, చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుని పేరు వంటి ముఖ్య వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. చెక్కును సమర్పించినప్పుడు బ్యాంకులు ఈ వివరాలను ధృవీకరిస్తాయి. వివరాలు సరిపోలితేనే చెక్ క్లియర్ అవుతుంది. లేకపోతే, రిక్వెస్ట్ తిరస్కరించబడుతుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను నిర్దిష్ట ప్రాంతీయ ఈమెయిల్ అడ్రస్లకు పంపాలి. ప్రాసెసింగ్ ప్రారంభించే ముందు, బ్యాంకులు రసీదు సందేశాన్ని పంపుతాయి.
ప్రస్తుతం బ్యాంకులు, చెక్కు ఎలక్ట్రానిక్ చిత్రాన్ని, వివరాలను డ్రాయీ బ్యాంకుకు పంపే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను (CTS) ఉపయోగిస్తున్నాయి. ఇది భౌతికంగా చెక్కును బదిలీ చేయాల్సిన అవసరాన్ని తొలగించినప్పటికీ, డ్రాప్ బాక్స్లు లేదా ఏటీఎంలలో డిపాజిట్ చేసినప్పుడు సెటిల్మెంట్ కావడానికి సాధారణంగా రెండు పని దినాలు పడుతోంది. ఇకపై రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు పాజిటివ్ పే తప్పనిసరి అని, రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన వాటికి ఇది సిఫార్సు చేయబడుతుందని RBI తెలియజేసింది.
Falaknuma Road Over Bridge: ఫలక్నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
ఇక పాజిటివ్ పే కింద ధృవీకరించబడిన చెక్కులకు RBI వివాద పరిష్కార వ్యవస్థలో రక్షణ లభిస్తుంది. నిరంతర క్లియరింగ్, సెటిల్మెంట్లో మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుండి, అలాగే రెండవ దశ జనవరి 3, 2026 నుండి ప్రారంభమవుతుందని RBI ప్రకటించింది. తిరస్కరణను నివారించడానికి, కస్టమర్లు అంకెల్లో, అక్షరాలలో రాసిన మొత్తం సరిపోలాలని, చెక్ తేదీ చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, చెల్లింపుదారుని పేరు లేదా మొత్తంలో ఓవర్రైటింగ్ ఉండకూడదని, అలాగే సంతకం బ్యాంకు రికార్డులతో సరిపోలాలని నిర్ధారించుకోవాలి.
- Tags
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!