Mumbai hoarding: వెలుగులోకి వచ్చిన దారుణమైన విషయాలు.. నిందితుడి హిస్టరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం ఆర్థిక రాజధాని ముంబై గాలి తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. 76 మంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఊహించని పరిణామంలో అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఇది కూడా చదవండి: Yellow Urine Reasons: ఈ కారణాల వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి!
Also Read
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- Trump: తేడాలు చేస్తే ఒమన్ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
ఈ ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్లు పెట్టినందుకు ఇప్పటికే భవేశ్పై 20కి పైగా జరిమానా పడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో అతడిపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైంది. అయితే ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు. అది తప్పుడు కేసు అని అతడి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
ఇక ఘాట్కోపర్ ప్రాంతంలో కూలిన హోర్డింగ్ కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్ ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ హోర్డింగ్ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కన్నా తొమ్మిది రెట్లు పెద్దదని చెప్పారు. సోమవారం రాత్రి ములుంద్ ప్రాంతంలోని భవేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి జాడ కనిపించలేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భవేశ్ తన కుటుంబంతో కలిసి దేశం దాటాడని, కానీ ముంబై పోలీసులు మాత్రం అతడిని పట్టుకోవడానికి కష్టపడుతున్నారని ఓ బీజేపీ నేత ఎద్దేవా చేశారు.
ఇక హోర్డింగ్ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ముప్పు పొంచి హోర్డింగ్లు తొలగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Nani: అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్
తాజావార్తలు
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
-
AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
-
CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
-
Trump: తేడాలు చేస్తే ఒమన్ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
-
Trump: ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!