Mumbai hoarding: వెలుగులోకి వచ్చిన దారుణమైన విషయాలు.. నిందితుడి హిస్టరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం ఆర్థిక రాజధాని ముంబై గాలి తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. 76 మంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఊహించని పరిణామంలో అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఇది కూడా చదవండి: Yellow Urine Reasons: ఈ కారణాల వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి!
Also Read
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనలో ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అయితే అతడి గురించి ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్లు పెట్టినందుకు ఇప్పటికే భవేశ్పై 20కి పైగా జరిమానా పడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో అతడిపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైంది. అయితే ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు. అది తప్పుడు కేసు అని అతడి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
ఇక ఘాట్కోపర్ ప్రాంతంలో కూలిన హోర్డింగ్ కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్ ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ హోర్డింగ్ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కన్నా తొమ్మిది రెట్లు పెద్దదని చెప్పారు. సోమవారం రాత్రి ములుంద్ ప్రాంతంలోని భవేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి జాడ కనిపించలేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భవేశ్ తన కుటుంబంతో కలిసి దేశం దాటాడని, కానీ ముంబై పోలీసులు మాత్రం అతడిని పట్టుకోవడానికి కష్టపడుతున్నారని ఓ బీజేపీ నేత ఎద్దేవా చేశారు.
ఇక హోర్డింగ్ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక ముప్పు పొంచి హోర్డింగ్లు తొలగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Nani: అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్
తాజావార్తలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?