TS Crime News: మొగుడే యముడు.. రెండో భార్య అందుకు ఒప్పుకోలేదని..!
- కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు
- ఫెన్సింగ్ రాయితో రెండో భార్య ఛాతీపై మోదాడు
- నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కలిసి బతుకుదాం అని నమ్మించి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు. చున్నీతో ఉరి వేశాడు కానీ అప్పటికీ చావలేదని.. ఫెన్సింగ్ రాయితో ఛాతీపై మోదాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్యను అత్యంత దారుణంగా చంపేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడలో జరిగింది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వానరాశి జంగయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ స్వస్థలం. కానీ అతడు చాలా కాలం నుంచి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మరో విషయం ఏంటంటే జంగయ్యకు ఇద్దరు భార్యలు. ప్రస్తుతం మొదటి భార్యతోనే ఉంటున్నాడు. కానీ రెండో భార్య రజిత మాత్రం విడిగా ఉంటోంది. రజితతో చాలా రోజుల క్రితం నుంచే జంగయ్యకు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆమె వేరుగా నివాసం ఉంటోంది. ఐతే జంగయ్య.. ఈ మధ్య కలిసి జీవిద్దాం అని చెప్పి తన ఊరు వెంకన్నగూడకు రప్పించాడు. పెద్దల సమక్షంలో ఇరువురు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ రజిత.. జంగయ్యతో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను భార్యపై కక్ష పెంచుకున్నాడు.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
Also Read: Crime News: కన్న తల్లినే దారుణంగా చంపేసిన కొడుకు.. కారణం తెలిస్తే బిత్తరపోవాల్సిందే!
ఇద్దరూ.. ఊరు నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊరికి సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన జంగయ్య.. రజిత మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశాడు. అప్పుడు కూడా ఆమె కొన ఊపిరితో ఉండడంతో.. పక్కనే ఉన్న ఫెన్సింగ్ దిమ్మెను తీసుకుని ఆమె ఛాతీపై బలంగా మోదాడు. అప్పుడు రజిత ప్రాణాలు కోల్పోయింది. స్పాట్లోనే రెండో భార్య రజిత డెడ్ బాడీ ఫోటోలు తీసుకున్నాడు జంగయ్య. ఆ ఫోటోలను మొదటి భార్యకు పంపించాడు. అంతే కాదు ఆమెకు కాల్ చేసి.. ఇదిగో ఇలా చంపాను అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతని ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు.. రజిత డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత జంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?