TS Crime News: మొగుడే యముడు.. రెండో భార్య అందుకు ఒప్పుకోలేదని..!
- కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు
- ఫెన్సింగ్ రాయితో రెండో భార్య ఛాతీపై మోదాడు
- నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కలిసి బతుకుదాం అని నమ్మించి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు. చున్నీతో ఉరి వేశాడు కానీ అప్పటికీ చావలేదని.. ఫెన్సింగ్ రాయితో ఛాతీపై మోదాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్యను అత్యంత దారుణంగా చంపేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడలో జరిగింది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వానరాశి జంగయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ స్వస్థలం. కానీ అతడు చాలా కాలం నుంచి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మరో విషయం ఏంటంటే జంగయ్యకు ఇద్దరు భార్యలు. ప్రస్తుతం మొదటి భార్యతోనే ఉంటున్నాడు. కానీ రెండో భార్య రజిత మాత్రం విడిగా ఉంటోంది. రజితతో చాలా రోజుల క్రితం నుంచే జంగయ్యకు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆమె వేరుగా నివాసం ఉంటోంది. ఐతే జంగయ్య.. ఈ మధ్య కలిసి జీవిద్దాం అని చెప్పి తన ఊరు వెంకన్నగూడకు రప్పించాడు. పెద్దల సమక్షంలో ఇరువురు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ రజిత.. జంగయ్యతో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను భార్యపై కక్ష పెంచుకున్నాడు.
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
Also Read: Crime News: కన్న తల్లినే దారుణంగా చంపేసిన కొడుకు.. కారణం తెలిస్తే బిత్తరపోవాల్సిందే!
ఇద్దరూ.. ఊరు నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊరికి సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన జంగయ్య.. రజిత మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశాడు. అప్పుడు కూడా ఆమె కొన ఊపిరితో ఉండడంతో.. పక్కనే ఉన్న ఫెన్సింగ్ దిమ్మెను తీసుకుని ఆమె ఛాతీపై బలంగా మోదాడు. అప్పుడు రజిత ప్రాణాలు కోల్పోయింది. స్పాట్లోనే రెండో భార్య రజిత డెడ్ బాడీ ఫోటోలు తీసుకున్నాడు జంగయ్య. ఆ ఫోటోలను మొదటి భార్యకు పంపించాడు. అంతే కాదు ఆమెకు కాల్ చేసి.. ఇదిగో ఇలా చంపాను అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతని ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు.. రజిత డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత జంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..