Site icon NTV Telugu

Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..

Ram Charan

Ram Charan

Peddi: ‘పెద్ది’ షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఒక హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన షూటింగ్‌లో రామ్ చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న కోత పడింది. వెంటనే వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వైద్యులు ధృవీకరించారు.

READ ALSO: Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..

వైద్యులు కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, రామ్ చరణ్ తన డెడికేషన్‌ను చాటుకున్నారు. షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఆయన రేపటి నుంచే సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు చిత్ర బృందం తాజా ప్రకటనలో వెల్లడించింది. తాజా ప్రకటనలో “అంతా క్షేమంగా ఉంది, షూటింగ్ యధావిధిగా కొనసాగుతోంది” అని అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న అనవసర ఊహాగానాలను నమ్మవద్దని టీమ్ కోరింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీ-స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది. త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం కానుంది. చరణ్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని, సినిమా సకాలంలో థియేటర్లలోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

READ ALSO: Uppudu Pindi: షుగర్ ఉన్నవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసేయండి!

Exit mobile version