స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ 2011లో `కేరటం` అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సందీప్ కిషన్తో కలసి నటించిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. అంతే ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది.కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 13 సినిమాల్లో నటించింది.. ఈ భామ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది.వీరితోపాటు సీనియర్ హీరో నాగార్జున తో `మన్మథుడు 2`, నితిన్ తో `చెక్`, వైష్ణవ్ తేజ్తో `కొండపొలం` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. దీనితో ఈ భామకు బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
హిందీలో ఈ భామ వరుసగా ఏడెనిమిది సినిమాలను చేసింది.కానీ అక్కడ కూడా రకుల్ కి అంత గా సక్సెస్ దక్కలేదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో అలరించింది కానీ ఈ భామకు సక్సెస్ రాలేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ లో `మేరి పత్న కా రీమేక్`, తమిళంలో `ఇండియన్ 2`.సినిమాలో నటిస్తుంది..తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్లోనే ఉంటుందీ ఈ బ్యూటీ.నిత్యం హాట్ ఫోటో షూట్లు చేసి వాటిని అభిమానులకు షేర్ చేస్తుంది.. గ్యాప్ లేకుండా అందాల దాడి చేసి ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా జాతీయ జెండాతో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వైట్ అండ్ వైట్ లో అదరగొడుతుంది.వైట్ కోట్ మరియు వైట్ ఫ్యాంట్ ధరించి స్టన్నింగ్ పోజులిచ్చింది. క్యూట్ స్మైల్ తో ఎంతగానో ఆకట్టుకుంది.ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి