Rajnath Singh: హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు దేశానికి అంకితం.. విశాఖలో రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.
Ganesh Idol Trunk: గణపయ్య విగ్రహంలో తొండం ఎటు వైపు ఉండాలంటే.. కుడి వైపా? ఎడమ వైపా?
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
ఇండో-పసిఫిక్ ప్రాంతం, చైనా సరిహద్దులలో వ్యూహాత్మక రక్షణలో ఈ రెండు నౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం దేశ రక్షణలో మరో మైలురాయిగా నిలవనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సిద్ధాంతానికి నిదర్శనంగా, మన దేశీయ MSME రంగం సాంకేతిక ప్రతిభ ఈ నౌకల్లో ప్రతిబింబిస్తోంది.
రక్షణ శాఖ లక్ష్యాల ప్రకారం 2050 నాటికి 200 యుద్ధనౌకలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని, ఇది భారత నావికాదళ శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్య పోరు ఉన్నా, భారత్ మాత్రం “వసుధైక కుటుంబకం” అనే సూత్రాన్నే తన సిద్ధాంతంగా కొనసాగిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన పహల్గాం దాడిపై తీవ్రంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్, దానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల పాటవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్ టీవీలు లాంచ్!
ఈ ఆపరేషన్ ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే త్రివిధ దళాలు ఆపరేషన్ కోసం సిద్ధం కావడం జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భారత రక్షణ దళాలు మరింత బలోపేతం అవుతున్నాయని, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతికత, కార్యాచరణలతో దేశ భద్రతా వ్యవస్థ మరింతగా దృఢం అవుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!