Rajkot Massive Fire : రాజ్ కోట్ లో 27మంది ప్రాణాలు గాల్లో కలవడానికి కారణం ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajkot Massive Fire : ఇనుప స్థంభాలు, టిన్ షెడ్, చిన్న గోడలు… టీఆర్పీ గేమ్జోన్లో ఇదొక్కటే మిగిలి ఉంది. మిగతావన్నీ బూడిద పాలయ్యాయి. గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా 28 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రాధిక భరాయ్ ప్రకారం.. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంత పూర్తిగా కాలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.నాలుగు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం అందజేస్తుంది.
రాజ్కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4:30 గంటలకు గేమ్జోన్లో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక నియంత్రణ గదికి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం, అంబులెన్స్ను తరలించి మంటలను ఆర్పారు. గేమ్జోన్ నుండి తప్పించుకున్న వారిలో ఒకరు శనివారం టిఆర్పి గేమ్జోన్లో అంతా బాగానే ఉందని చెప్పారు. పిల్లలు ఆడుకుంటూ బిజీగా ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. క్షణాల్లోనే మంటలు గేమ్జోన్కు వ్యాపించాయి. కిలోమీటరు దూరం వరకు నల్లటి పొగ కమ్ముకుంది.
Also Read
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Also:Remal cyclone effect: కోల్కతా ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు రద్దు
పేలుడు ఎలా జరిగింది?
గేమ్ జోన్లో ఏసీలు ఇన్స్టాల్ చేయబడ్డాయి. వీటిలో ఒక ఏసీ పేలింది. బహుశా పేలుడుకు షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు. దీని తరువాత, నేలపై ఉన్న ఫాబ్రికేషన్ మంటల్లో చిక్కకుంది. తర్వాత కొద్దిసేపటికే మంటలు మొత్తం గేమ్ జోన్కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోయారు.
పోస్టుమార్టానికి మృతదేహాలు
స్థానిక ప్రజల ప్రకారం, గేమ్జోన్కు నలుగురు యజమానులు ఉన్నారు. వీరిలో యువరాజ్ సింగ్ సోలంకి, ప్రకాష్ జైన్, రాహుల్ రాథోడ్, మహేంద్ర సింగ్ సోలంకి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరైన యువరాజ్ సింగ్ సోలంకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలన్నింటిని అదుపులోకి తీసుకుని పోస్ట్మార్టంకు తరలించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Also:Team India Headcoach: హెడ్ కోచ్ పదవిపై మనసులో మాటను బయటపెట్టిన ఏబిడి..
ఈ ప్రమాదంపై లెక్కలేనన్ని ప్రశ్నలు
ఈ ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు పోలీసు యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక దళాలకు తలెత్తుతున్నాయి. టీఆర్పీ గేమ్జోన్కు అగ్నిమాపక దళం NOC ఇచ్చిందా అనేది మొదటి ప్రశ్న. టీఆర్పీ గేమ్జోన్ అగ్నిమాపక వ్యవస్థను ఇన్స్టాల్ చేసిందా? అనేది రెండో ప్రశ్న.
సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు
ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. రాజ్కోట్ పోలీస్ కమిషనర్ నగరంలోని అన్ని గేమ్ జోన్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ తన సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్లో రాశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
తాజావార్తలు
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
-
Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!