Rajiv Shukla: బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు.. వేల కోట్లు జీఎస్టీ చెల్లిస్తున్నాం!
- బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు
- ధరల పెంపు ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది
- ఇప్పటి వరకైతే ఎవరి పేరూ కన్ఫర్మ్ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను మినహాయింపులను బీసీసీఐ పొందుతోందని వస్తున్న విమర్శలపై బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘బీసీసీఐ కూడా ఓ కార్పొరేట్ కంపెనీ లాగే పన్నులు చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా కడుతోంది. మాకు ఎటువంటి మినహాయింపులు లేవు. మేము వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు కడుతున్నాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తీసుకోము’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దాంతో బీసీసీఐపై వస్తున్న విమర్శలకు చెక్ పడింది.
ఇటీవల సవరించిన జీఎస్టీ కారణంగా ఐపీఎల్ టిక్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. క్యాసినోలు, రేస్ క్లబ్లతో పాటు ఇప్పుడు ఐపీఎల్ టికెట్స్ కూడా 40 శాతం స్లాబ్ కిందకు వచ్చాయి. దాంతో రూ.500 టికెట్ ధర రూ.700 కాగా.. రూ.2000 టికెట్ ధర ఇప్పుడు రూ.2,800 అవుతుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్లకు మాత్రం 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడారు. ‘ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఐపీఎల్ను చూస్తారు. ధరల పెంపు ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది. చాలా మంది ఐపీఎల్ చూడటానికి వస్తారని నేను ఆశిస్తున్నాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Also Read: IND vs PAK: మా వేదనను అప్పుడే మర్చిపోయారా?.. బీసీసీఐపై పహల్గాం బాధితురాలు ఆగ్రహం!
ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 వైదొలగిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 16న ముగియనుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. మరో 2,3 వారాల్లో కొత్త జెర్సీ స్పాన్సర్ను ప్రకటిస్తామని చెప్పారు. టెండర్ల ప్రకియ ప్రారంభమైందని, చాలా బిడ్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకైతే ఎవరి పేరూ కన్ఫర్మ్ చేయలేదని, ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ పేరు వెల్లడిస్తాం అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!