Rajiv Shukla: బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు.. వేల కోట్లు జీఎస్టీ చెల్లిస్తున్నాం!
- బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు
- ధరల పెంపు ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది
- ఇప్పటి వరకైతే ఎవరి పేరూ కన్ఫర్మ్ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను మినహాయింపులను బీసీసీఐ పొందుతోందని వస్తున్న విమర్శలపై బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘బీసీసీఐ కూడా ఓ కార్పొరేట్ కంపెనీ లాగే పన్నులు చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా కడుతోంది. మాకు ఎటువంటి మినహాయింపులు లేవు. మేము వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు కడుతున్నాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తీసుకోము’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దాంతో బీసీసీఐపై వస్తున్న విమర్శలకు చెక్ పడింది.
ఇటీవల సవరించిన జీఎస్టీ కారణంగా ఐపీఎల్ టిక్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. క్యాసినోలు, రేస్ క్లబ్లతో పాటు ఇప్పుడు ఐపీఎల్ టికెట్స్ కూడా 40 శాతం స్లాబ్ కిందకు వచ్చాయి. దాంతో రూ.500 టికెట్ ధర రూ.700 కాగా.. రూ.2000 టికెట్ ధర ఇప్పుడు రూ.2,800 అవుతుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్లకు మాత్రం 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడారు. ‘ఎక్కువ మంది సాధారణ ప్రజలు ఐపీఎల్ను చూస్తారు. ధరల పెంపు ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది. చాలా మంది ఐపీఎల్ చూడటానికి వస్తారని నేను ఆశిస్తున్నాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
Also Read: IND vs PAK: మా వేదనను అప్పుడే మర్చిపోయారా?.. బీసీసీఐపై పహల్గాం బాధితురాలు ఆగ్రహం!
ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 వైదొలగిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 16న ముగియనుంది. దీనిపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. మరో 2,3 వారాల్లో కొత్త జెర్సీ స్పాన్సర్ను ప్రకటిస్తామని చెప్పారు. టెండర్ల ప్రకియ ప్రారంభమైందని, చాలా బిడ్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకైతే ఎవరి పేరూ కన్ఫర్మ్ చేయలేదని, ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ పేరు వెల్లడిస్తాం అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?